Home Blog Page 11

వైసిపి కి డ్యామేజ్.. విజయసాయిరెడ్డి సూచన!

Vijaya Sai Reddy
Vijaya Sai Reddy

Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలవరం ప్రారంభం అయ్యింది. జోసెఫ్ రావణ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు ప్రజల్లోకి భిన్నంగా వెళ్తోంది. ముఖ్యంగా హిందుత్వ వ్యతిరేక ముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడుతోంది. సమాజంలో అరాచకాలు సృష్టించే వారి కులం, మతాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని అనుకుంటుందని అభిప్రాయం పెరుగుతోంది. అందుకే వరుస పెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ముందుకు వస్తున్నారు. జోసెఫ్ రావణ్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు. కేవలం భయంతోనే ఇప్పుడు స్పష్టత ఇస్తున్నారు. ఈనెల 1న జోసెఫ్ రావణ్ అరెస్టయ్యారు. అయితే ప్రారంభంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన తప్పేంటి అన్నట్టు మాట్లాడింది. తీరా ఆయన చేసిన తప్పిదాలు, చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా బయటకు రావడంతో ఆందోళన ప్రారంభం అయింది. అప్పటినుంచి దిద్దుబాటు అన్నట్టు మాట్లాడుతున్నారు.

* నీళ్లు చల్లిన మాజీ నేత..
తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లేశారు విజయసాయిరెడ్డి. జోసెఫ్ రావణ్ అరెస్ట్ ప్రస్తావన తీసుకొచ్చి ఓ సుదీర్ఘ ట్విట్ చేశారు. మతమార్పిడిలను సమర్థించడం, మన సంస్కృతి పై దాడి చేయడం కొందరికి ఫ్యాషన్ గా మారిపోయిందని.. ఆ వ్యాఖ్యలను సమర్థించే వారికి గుణపాఠం చెప్పాలని విజయసాయిరెడ్డి కోరారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్యలను తప్పుపట్టారు విజయసాయిరెడ్డి. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి అలా మాట్లాడారో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన పెరిగింది. ఈ క్రమంలోనే సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివారు రంగంలోకి దిగారు. జోసెఫ్ రావణ్ తో వైసీపీకి సంబంధం లేదని ప్రకటించారు.

* సలహాగా తీసుకుంటే..
విజయసాయిరెడ్డి ట్వీట్ ను ఒక విధంగా సలహాగానే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన కీలక సూచన చేసినట్లు అయింది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. దానిని మరింత రెట్టింపు చేసింది ఈ వ్యవహారం. అందుకే జోసెఫ్ రావణ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గితే మంచిది అన్నట్టు విజయసాయిరెడ్డి ట్వీట్ ఉంది. సాధారణంగా ప్రభుత్వ వైఫల్యం ఏమాత్రం కనిపించినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతోంది. మరి వైసీపీ చర్యలను నిశితంగా గమనిస్తుంది కూటమి. వైసీపీపై హిందుత్వ వ్యతిరేకం ముద్ర ఉండడంతో ఇప్పుడు జోసెఫ్ రావణ్ వ్యవహారాన్ని వాడుకుంటుంది. టిడిపి కంటే విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు రేపుతోంది.

రోజ్ సర్దానా? నీ అందాలు సర్దేయాలా?

Rose Sardana latest photos
Rose Sardana latest photos

వైఎస్ షర్మిల దారెటు?!

YS Sharmila
YS Sharmila

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మౌనముద్ర లో ఉన్నారు. నిన్ననే రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. తండ్రికి ఆమె నివాళులు అర్పించారు. మీడియా ముందుకు వచ్చి పొడిపొడిగానే మాట్లాడి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా ఆమె సైలెంట్ గానే ఉంటున్నారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత ఆమె పెద్దగా కనిపించకుండా మానేశారు. ఆ ఎన్నికల్లో షర్మిలకు ఛాన్స్ ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పినట్లు ప్రచారం నడిచింది. ఆ సమయంలో ఆమె ఢిల్లీ కూడా వెళ్లారు. కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఆమెకు కర్ణాటక నుంచి ఛాన్స్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. దీంతో అప్పటినుంచి ఆమె మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. అయితే తండ్రి జయంతి నాడు కొద్దిమంది కుటుంబ సభ్యులతో వచ్చి నివాళులు అర్పించారు.

* సోదరుడిని విభేదించి..
రాజశేఖర్ రెడ్డి అకాల మరణం సమయంలో షర్మిల తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి వెంట బలంగా నడిచారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం కృషి చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేశారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వ్యక్తిగతంతో పాటు రాజకీయ అంశాలపై ఆయనను విభేదించారు షర్మిల. తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడ వర్క్ అవుట్ కాకపోయేసరికి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్నారు జగన్. షర్మిలకు బాధ్యతలు ఇవ్వడం ద్వారా దానిని తిరిగి తీసుకోవాలని కాంగ్రెస్ భావించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. షర్మిల ద్వారా కాంగ్రెస్ బలపడిన పరిస్థితి కనిపించడం లేదు. అందుకే షర్మిల విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ పదవి ఇవ్వక పోవడానికి అదే కారణంగా తెలుస్తోంది.

* ఆ కారణంతో సైతం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇండియా కూటమి సాఫ్ట్ కార్నర్ తో ఉంది. ఎందుకంటే టిడిపి ఎన్ డి ఏ లో కీలక భాగస్వామిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చివరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో పనిచేయక తప్పదు.. ఆ విషయం షర్మిలకు కూడా తెలుసు. ఒక విధంగా కర్ణాటక నుంచి తనకు రాజ్యసభ పదవి రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమన్న అనుమానం ఉంది. రేపు ఇండియా కూటమిలో జగన్ చేరితే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కరం అని ఆమె భావిస్తున్నారు. అందుకే మౌనముద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులపాటు పొలిటికల్ సైలెన్స్ పాటిస్తే మంచిది అన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..

దక్షిణ కొరియాలో లోకేష్ పెట్టుబడుల వేట!

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో భాగంగా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు, ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆకర్షించేందుకు వీలుగా.. లోకేష్ నేతృత్వంలో ఏం చేస్తున్న ప్రయత్నాలు అందరి ప్రశంసలను అందుకుంటున్నాయి. దక్షిణ కొరియా ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలో పనిచేసే అత్యున్నత పరిశోధనా సంస్థ కొరియా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీ ఇండియా, సౌత్ ఆసియా టీం హెడ్ క్యూంగ్ హూన్ కిమ్ లోకేష్ టూర్ ను అభినందిస్తూ ట్విట్ చేశారు. ఎకనామిక్ డిప్లమసి ఎల్ ఫుల్ త్రాటిల్ అంటూ ఏపీ టీం పర్యటనను కొనియాడారు. నారా లోకేష్ బృందం దక్షిణ కొరియా పర్యటనలు ఏమాత్రం సమయం వృధా చేయకుండా.. గ్లోబల్ మార్కెట్ ను శాసిస్తున్న షూ ఆల్స్, సోలమ్, అపాక్ట్, సాంసంగ్, ఎల్జి, బు యంగ్, హ్వాసింగ్ వంటి ఎన్నో దిగ్గజ బహుళ జాతి కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహించడాన్ని ప్రస్తావించారు. హాట్సాఫ్ టు ద టీం అంటూ కిమ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

* పెట్టుబడులపైనే ఫోకస్..
లోకేష్ నిజంగా చేస్తున్న ప్రయత్నాలు ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన పెట్టుబడులపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. విదేశీ పర్యటనలు చేస్తూ భారీగా పరిశ్రమలను తెస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో పెట్టుబడులు లేక ఏపీ స్తబ్దుగా మారింది. కానీ ఇప్పుడు చంద్రబాబు విజన్, నారా లోకేష్ స్పీడ్ తో పూర్వ వైభవం రావడం ఖాయం అనే నమ్మకం పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఒక దేశ ప్రధాని కార్యాలయం కింద పనిచేసి అంతర్జాతీయ ఆర్థిక నిపుణుడే స్వయంగా లోకేష్ ఎకనామిక్ డిప్లమసిని మెచ్చుకోవడం.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను గ్లోబల్ లెవెల్లో మరింత పెంచిందనడంలో సందేహం లేదు.

* రేపు భారీ రోడ్ షో..
ఈనెల 10 వరకు పర్యటన కొనసాగనుంది దక్షిణ కొరియాలో. రేపు భారీ రోడ్ షో ఉండనుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని ప్రఖ్యాత లొట్టి హోటల్ క్రిస్టల్ బాల్ రూమ్ లో భారీ ఎత్తున ఏపీ – దక్షిణ కొరియా బిజినెస్ ఫోరం, సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షో నిర్వహించబోతున్నట్లు కిమ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ ఎంబసీ సమన్వయంతో.. జూలై 10 మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఈ రోడ్ షో మొదలు కానుంది. దక్షిణ కొరియాలోని అగ్రశ్రేణి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉంది.

'దువ్వాడ' కష్టాన్ని గుర్తించని 'ధర్మాన'!

Duvvada Srinivas
Duvvada Srinivas

Duvvada Srinivas: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఆ పార్టీ ప్రజా పోరాటాలు చేయడం లేదన్న విమర్శ ఉంది. ఎంతవరకు ఆ పార్టీ శ్రేణుల అరెస్టు, కేసుల మీద పోరాటం తప్ప.. ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వం పై విమర్శలు చేయడం తప్ప.. సీనియర్ నేతలు పెద్దగా పనిచేయడం లేదన్న విమర్శ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన తమ పార్టీకి చెందిన నేత ఒకరిని కేసులు పెట్టి జైల్లో పెట్టడాన్ని తప్పుపడుతూ పరామర్శించారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి పోలీసు విచారణ ఎదుర్కొంటున్న దువ్వాడ శ్రీనివాస్ ను మాత్రం కనీసం పలకరించడం లేదు. పైగా జగనన్న అధికారంలోకి వస్తే తన తడాఖా చూపిస్తాను అంటూ మాట్లాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్.

– విచారణకు హాజరు..
మొన్న మధ్యన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ ను విచారించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదు పై పోలీసులు నోటీసులు అందించారు. దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. రోజంతా హైడ్రామా నెలకొంది. తర్వాత మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. కానీ పోలీస్ స్టేషన్కు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ అక్కడకు చేరుకోలేదు. ఆయన ఒడిస్సాలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దువ్వాడ శ్రీనివాసును పోలీసుల దాచి ఇలా చేస్తున్నారు అంటూ ఆయన సహచరి మాధురి ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ తో పాటు భారతిని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపాయి. గాని జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు పరామర్శించిన దాఖలాలు లేవు.

* సామాన్య కార్యకర్తకు పరామర్శ..
అయితే తాజాగా ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి నష్టం తప్పదని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. జైలుకు వెళ్లి ఆయనను పరామర్శించారు. అయితే తాను జగన్మోహన్ రెడ్డి భక్తుడినని.. జగన్ వస్తే మళ్లీ ప్రత్యర్థులను తాటతీస్తామని హెచ్చరిస్తున్నారు దువ్వాడ. ఒకవైపు ఆయన కు మద్దతుగా వైసీపీ శ్రేణులు వస్తున్నారు. దువ్వాడతోపాటు మాధురి జగన్మోహన్ రెడ్డి పట్ల అనుకూల ప్రకటనలు చేస్తున్నారు. తన జైలు జీవితమంతా జగన్ కోసమే అన్నట్టు దువ్వాడ చెబుతున్నారు. కానీ ఒక సామాన్య కార్యకర్తకు జైలుకు వెళ్లి పరామర్శించిన ధర్మాన.. దువ్వాడ శ్రీనివాస్ బాధను, పోరాటాన్ని అర్థం చేసుకోవడం లేదు. కానీ గొప్ప పలుకులు వల్లె వేస్తున్నారు.

చంద్రబాబుపై ఉపాధ్యాయులను ఉసిగొల్పుతున్న జగన్!

YS Jagan
YS Jagan

YS Jagan: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనల వల్ల ఉపాధ్యాయులు బాధపడుతున్నారు. అయితే ఈ నిబంధన తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. 2011 కంటే ముందు నుంచి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరి చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో టెట్ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ విషయంలో ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్. కానీ జాతీయస్థాయిలో తీసుకున్న నిర్ణయం కావడంతో 2011 కంటే ముందు నియామకం అయిన ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాల్సిందే అన్నట్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. అయితే తాజాగా దానిని తప్పుపడుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు తప్ప.. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు.

* సుదీర్ఘ పోస్ట్..
తాజాగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనల వల్ల.. ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. 2011 కంటే ముందు నుంచి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు తప్పనిసరి చేయడానికి తప్పు పట్టారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలంటూ సూచన చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చూస్తే రెండు రకాల సందేహాలతో పాటు ఆయన పైనే అనుమానాలు వ్యక్తం ఎలా ఉన్నాయి పరిణామాలు. ఒకటి ఆయన అసెంబ్లీకి రారు. అందుకే ఆ సూచన ను పరిగణలోకి తీసుకోనవసరం లేదు. ఆపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా ఆయన అనలేదు. దీంతో రాజకీయ దురుద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు అర్థం అవుతుంది.

* కేంద్రం ఆదేశాలతోనే..
జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేస్తున్నాయి. అయితే దీనిని చంద్రబాబు పై నెట్టేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని.. పూర్తిగా కేంద్ర చట్టాలకు లోబడి ఒక సున్నితమైన విద్యావ్యవస్థపరమైన అంశాన్ని పట్టుకొని.. చంద్రబాబును అందించడం జగన్ పొలిటికల్ స్ట్రాటజీ లో భాగమే అని స్పష్టం అవుతుంది. ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తే సరిపోయేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయడం లేదు. కేంద్రంలో ఉన్న పెద్దలను నేరుగా ప్రశ్నిస్తూ ఆ చట్టంలో మార్పులు, రూల్స్ పై సలహాలు ఇవ్వచ్చు కదా. కానీ ఆ పని చేయడం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఉపాధ్యాయులు పడిన బాధలు అన్ని ఇన్ని కావు. ఇదే టెట్ నిబంధనలపై ఉపాధ్యాయులు న్యాయస్థానాల చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధ్యాయులను ఉసిగొల్పాలన్న ప్రయత్నం తప్ప అందులో ఏం కనిపించడం లేదు. ఉపాధ్యాయులకు సైతం తెలుసు ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన అని.

ఈ రాశుల వారికి ఈరోజు ధన ప్రవాహం.. వ్యాపారులకు అన్ని విజయాలే..

Today 9 July 2026 Horoscope
Today 9 July 2026 Horoscope

Today 9 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన పండుగ జరిగే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే ఉంటాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. ఉన్నట్లుండి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతుతో పరీక్షల్లో కలిసి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి సహకారం ఉండడంతో ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు లాభాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనుల్లో విజయం విజయం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొన్ని పనులలో ఉత్సాహంగా చేస్తూ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. వారి కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. ఇలాంటి సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఊహించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. కొన్ని పనులు పూర్తి కావడానికి ఇతరుల సహకారం తీసుకుంటారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యాపారులు తీసుకొని నిర్ణయాలతో వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయం కావడంతో పెట్టుబడులను పెంచుకుంటూ పోతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సానికూరమైన ఫలితాలు రానున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొత్త వస్తువుల కొనుగోలును నిలిపివేసుకోవడమే మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇతరుల సహకారం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి సహకారంతో అప్పులను తీరుస్తారు. గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. వ్యాపారులకు అన్నీ కలిసి వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇదే మంచి సమయం. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యం స్థిరంగా కొనసాగుతుంది. గతంలో మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించద్దు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. విదేశాలతో వ్యాపారం చేసేవారికి ఇదే మంచి సమయం.

నల్ల శనగలు ఎందుకు తినాలి.. వీటితో ఏం లాభం..

Black Chickpeas

Black Chickpeas : మనం తీసుకునే అత్యంత పోషకాహారంలో నల్ల శనగలు (Black Chickpeas/Kala Chana) ఒకటి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండటంతో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు తమ ఆహారంలో నల్ల శనగలను చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నల్ల శనగల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో అనవసరంగా ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం తగ్గుతుంది. తక్కువ కేలరీలతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి బరువు నియంత్రణకు దోహదపడుతుంది.నల్ల శనగల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచకుండా నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు పరిమిత మోతాదులో తీసుకోవచ్చు.

వీటిలో ఉండే ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటు నియంత్రణకు తోడ్పడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.ప్రోటీన్ సమృద్ధిగా ఉండటంతో కండరాల నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలం పునరుద్ధరణకు నల్ల శనగలు ఉపయోగపడతాయి. వ్యాయామం చేసే వారికి ఇవి మంచి సహజ ప్రోటీన్ ఆహారం. అధిక ఫైబర్ కారణంగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య తగ్గి పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నల్ల శనగల్లో ఐరన్, జింక్, ఫోలేట్ వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం మెరుగుపడుతుంది.ఐరన్ అధికంగా ఉండటంతో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు, యువతులు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

రాత్రంతా నల్ల శనగలను నీటిలో నానబెట్టి ఉదయం సలాడ్‌గా తినవచ్చు.మొలకెత్తించి తీసుకుంటే పోషక విలువలు మరింత పెరుగుతాయి.కూర, సుందల్, చాట్ లేదా కర్రీ రూపంలో కూడా వండుకుని తినవచ్చు.సూప్‌లు, పులావ్‌లలో కూడా కలిపి ఉపయోగించవచ్చు.

రైలులో ‘హనీమూన్ కోచ్’.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్

Honeymoon Coach

Honeymoon Coach : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ కొత్త జంటల కోసం హనీమూన్ ప్యాకేజీలు ఉంటాయి. ఈ క్రమంలో భాగంగా హనీమూన్ వారి జీవితంలో గొప్ప జ్ఞాపకం లాగా ఉండిపోవాలని నిర్వాహకులు రకరకాలుగా ఏర్పాటు చేస్తారు. సముద్రాన్ని ఆస్వాదిస్తూ.. నీటి మీద ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన హట్స్ లో నూతన దంపతులు ఏకాతాన్ని ఆస్వాదించే విధంగా అక్కడ వాతావరణాన్ని కల్పిస్తారు. అందువల్లే నూతన దంపతులు హనీమూన్ కోసం బాలి లేదా కేరళ వెళ్తూ ఉంటారు.

రోజురోజుకు పర్యాటకం మీద ప్రభుత్వాలు దృష్టిపెడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. ఎందుకంటే పర్యాటకంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదు. అందులో కాలుష్యం కూడా ఉండదు. కేవలం పర్యాటకులను ఆకర్షించే విధంగా రకరకాల మార్పులను.. కొత్తకొత్త విధానాలను రూపొందిస్తే సరిపోతుంది. సరిగ్గా ఇదే విధానాలను మన భారతీయ రైల్వే శాఖ అమలు చేస్తోంది. పర్యాటకలను ఆకర్షించేందుకు రకరకాల ప్రణాళికలను తెరమీదకు తీసుకొచ్చింది. ముఖ్యంగా నూతన జంటలకు అనుకూలంగా సరికొత్త ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఈ ప్యాకేజీలు ఎలా ఉన్నాయంటే…. విదేశాలు కాదు ఇండియాలోనే ఏకాంతాన్ని గడిపే విధంగా..

తాజాగా రైల్వే శాఖ హనీమూన్ కపుల్స్ కోసం ఒక ప్యాకేజీ తీసుకువచ్చింది. ఆ ప్యాకేజీ ప్రకారం రైల్లోనే హనీమూన్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా పడక గదులను సిద్ధం చేసింది. దానిమీద లవ్ సింబల్ లో గులాబీ రేకులను పరిచింది. బెలూన్లు ఏర్పాటు చేసింది. ఐ లవ్ యు అనే నేపథ్యంతో దీనిని రూపొందించింది.. శుభ్రతకు.. స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్ లాగా దీనిని తయారుచేసింది. హనీమూన్ కపుల్స్ ఇటువంటి వెదర్ చూడగానే వెంటనే ఇక్కడే గడిపేయాలన్నట్టుగా ఇండియన్ రైల్వే శాఖ మార్చింది. ఈ ఫోటోలు.. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఇలాంటి ప్యాకేజీలు ఇండియన్ రైల్వే శాఖ మరిన్ని అమలు చేస్తే కపుల్స్ రెచ్చిపోతారని.. విహారయాత్ర ప్రాంతాలలో కాకుండా రైళ్లలోనే హనీమూన్ చేసుకుంటారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ధోని రేంజ్ అది..ఫిఫా పోస్ట్ వైరల్

MS Dhoni

MS Dhoni : ధోని.. ఈ రెండు అక్షరాల పేరు భారత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే అతడు టీమిండియా కు విజయవంతమైన సారధిగానే కాకుండా.. అంతర్జాతీయంగా సరికొత్త గుర్తింపు తీసుకొచ్చాడు. టి20 వరల్డ్ కప్ అందించాడు. వన్డే వరల్డ్ కప్ దక్కేలా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందించాడు. ఒకవేళ ధోని ఉన్నప్పుడు ఐసీసీ గనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తే టీమిండియా కచ్చితంగా విజేతగా నిలిచేది. ఎందుకంటే అతడి నాయకత్వం అలా ఉంటుంది మరి.. ఆటగాడిగా.. నాయకుడిగా అతడు ద్విముఖ పాత్రను పోషించేవాడు. తోటి ప్లేయర్లలో స్ఫూర్తి నింపేవాడు.

ధోనీ ని జాతీయ క్రికెట్ జట్టులో మిస్టర్ కూల్ అనిపిస్తుంటారు.. టీమ్ ఇండియా మీద అతడు వేసిన ముద్ర అటువంటి మరి. ఏమాత్రం ఆవేశపడకుండా.. ఏమాత్రం తోటి ప్లేయర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేయకుండా విజయం లేదా అపజయం.. ఇలా ఏవి వచ్చినా సరే ధోని నిశ్శబ్దంగా ఉండేవాడు. తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. అందువల్ల టీమిండియా ఆ స్థాయిలో విజయాలు సాధించింది. వాస్తవానికి ఒక నాయకుడికి కావాల్సిందే ఆగ్రహం.. ఆవేశం కాదు.. కేవలం ఆలోచన.. స్ఫూర్తివంతమైన ప్రణాళిక.. వీటిని నూటికి నూరు శాతం అమలుచేసి టీం ఇండియాకు సానుకూలమైన ఫలితాలు వచ్చే విధంగా చేశాడు ధోని.

ధోని క్రికెట్ ఎలా అయితే ఆడతాడో.. ఫుట్ బాల్ కూడా అదే విధంగా చూస్తాడు. పైగా అతడికి ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. అనేక సందర్భాలలో ధోని ఫుట్ బాల్ మ్యాచ్ లు వీక్షిస్తూ ఆస్వాదించేవాడు. ఈ నేపథ్యంలో అతడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఫిఫా వరల్డ్ కప్ అఫీషియల్ హ్యాండిల్ ఇన్ స్టా గ్రామ్ లో ప్రత్యేకమైన పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ లో ప్రస్తుతం స్టార్ ప్లేయర్లు మెస్సి, ఏం బాపే.. హాలాండ్ తలా ఏడు గోల్స్ చేసి టాప్ స్థానంలో ఉన్నారు.. సెవెన్ గోల్స్ తల ఫర్ ఏ రీసన్ అని అంటువారి ఫోటోతో పోస్టర్ షేర్ చేసింది.. హ్యాపీ తలా డే అంటూ క్యాప్షన్ కూడా జత చేసింది. మరో వైపు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా సోషల్ మీడియాలో ధోనికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ధోని అభిమానులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో వీడియోలు.. కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ధోని నాయకత్వానికి.. ధోని సామర్థ్యానికి లభించిన గౌరవం ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ధోని ప్రస్తుతం 40+ సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికీ అతడు ఐపిఎల్ లో చెన్నై జట్టులో కొనసాగుతున్నాడు. ఇటీవల సీజన్లో అతడు ఆడలేక పోయినప్పటికీ.. అతడి రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. పైగా అతడు ఆడతాడని చెన్నై అభిమానులు భావించారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో అతడు బ్యాట్ పట్టుకోలేదు.. వికెట్ల వెనకాల ఉండి కీపింగ్ చేయలేదు. చివరి మ్యాచ్లో మాత్రం మైదానంలోకి వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. తోటి ప్లేయర్లతో కలిసి ఫోటోలు దిగాడు.

మల్కాజిగిరి సీపీ సుమితిపైనే సెటైర్.. స్టేజీపైనే హీరో నవీన్ పొలిశెట్టి కామెడీ.. వైరల్ వీడియో

Naveen Polishetty
Naveen Polishetty

Naveen Polishetty : యంగ్ హీరోల్లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరో నవీన్ పోలిశెట్టి. కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాదు , ఆఫ్ స్క్రీన్ లో కూడా నవీన్ పోలిశెట్టి చాలా సరదాగా ఉంటారు. అందుకే ఈయనకు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్. చేసింది కేవలం 5 సినిమాలే అయినా , బ్రాండ్ మాత్రం వేరే లెవెల్ లో ఏర్పడింది. ఆయన సినిమా వచ్చిందంటే చాలు , డైరెక్టర్ ఎవరు అనేది చూడరు , కళ్ళు మూసుకొని టికెట్స్ బుక్ చేసేస్తుంటారు ఆడియన్స్. అయితే ఇన్ని రోజులు ఎక్కువ కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన నవీన్ పోలిశెట్టి, తన తదుపరి చిత్రం లో సీరియస్ రోల్ లో నటించబోతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నేడు ఒక ఈవెంట్ లో ప్రకటించారు. మల్కాజ్ గిరి కమీషినర్ కమిషనరేట్ నిర్వహించిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న నవీన్ పోలిశెట్టి , సీపీ సుమతి పై సరదాగా కొన్ని కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో నేను ఈ స్టేజి మీద నిలబడి మాట్లాడడం చూస్తుంటే నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తోంది. ‘ఏమి ఫీల్ ఉన్నాది మామా ఇక్కడ’.. మీరందరు సుమతి మేడం వీడియో ఒకటి వచ్చింది రీసెంట్ గా చూశారా ?, నేను మా ఆఫీస్ టీం అందరం ఇటీవలే ఆ వీడియో గురించి మాట్లాడుకున్నాం. ఏమి యాక్టింగ్ చేశారు మేడం మీరు. మీ పోలీసులందరూ సుమతి మేడం ని రిక్వెస్ట్ చేయండి , ఆమెని నా తదుపరి చిత్రం లో నటించమని. నేను , సుమతి సుమతి మేడం కలిసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ లో నటించాలని నా కోరిక. నా తదుపరి చిత్రం లో నేను పోలీస్ ఆఫీసర్ రోల్ చేయబోతున్నాను . సజ్జనార్ సార్ , నాకు ఒకసారి గన్ పట్టుకోవడం నేర్పించాలి మీరు, ఖాళీ ఉన్నప్పుడు చెప్తే మీ దగ్గరకు వస్తాను ట్రైనింగ్ కోసం’ అంటూ నవీన్ పోలిశెట్టి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

https://www.youtube.com/shorts/bNHiICYUkRQ

పాకిస్తాన్‌ కార్గో ఫ్లైట్‌ మిస్‌.. అందులో ఏముంది.. ఎటు వెళ్తోంది?

pakistan-cargo-boeing-737-flight-missing-navigation-failure

Pakistan Cargo Plane : భారత నిఘా విమానాలు, రవాణా విమానాలపై ఎప్పుడూ నిఘా పెట్టే పాకిస్తాన్‌.. ఇప్పుడు తన కార్గోఫ్లైట్‌ మిస్‌ కావడంతో తల పట్టుకుటోంది. ఈ ఫ్లైట్‌లో ఐదుగురు క్రూ సభ్యులు ఉన్నారు. కచారీ ప్రాంతం సమీపంలో ఇది జరిగింది. ఫ్లైట్‌ కేటూ ఎయిర్‌వేస్‌కు సంబంధించిన బోయింగ్‌ 737 మోడల్‌. నావిగేషన్‌ వ్యవస్థలో వైఫల్యం ఏర్పడి, గ్రౌండ్‌ కంట్రోల్‌తో సంపర్కం పూర్తిగా తెగిపోయింది. ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

నావిగేషన్‌ వైఫల్యం..
బోయింగ్‌ 737 విమానంలో నావిగేషన్‌ సిస్టమ్‌ వైఫల్యం అంటే విమానం దిశ, ఎత్తు, వేగం వంటి కీలక సమాచారం అందుబాటులో లేకపోవడంతో పైలట్లు విమానాన్ని సరైన మార్గంలో నడపడం కష్టమవుతుంది. కమ్యూనికేషన్‌ తెగిపోవడం, రేడియో, ట్రాన్స్‌పాండర్, సాటిలైట్‌ లింక్‌లు అన్నీ నిలిచిపోయాయి. ఇలాంటి సందర్భాల్లో విమానం ఏ దిశలో ఎంత ఎత్తులో ఉందో తెలియకపోవడం శోధనను మరింత కష్టతరం చేస్తుంది.

గాలింపు ముమ్మరం..
నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలు ఉమ్మడిగా శోధన ఆపరేషన్‌ను చేపట్టాయి. ఇది విమానం సముద్రం లేదా దుర్గమ ప్రాంతంలో పడిపోయి ఉండవచ్చని సూచిస్తుంది. సాధారణంగా వాణిజ్య విమానాలు అదృశ్యమైనప్పుడు సివిల్‌ ఏజెన్సీలు ముందుగా శోధిస్తాయి. కానీ ఇక్కడ సైనిక బలగాలు నేరుగా ఇన్వాల్వ్‌ అవ్వడం సంఘటన తీవ్రతను తెలియజేస్తుంది.

దొరకని ఆచూకీ..
క్రూ సభ్యులు ప్యారాచూట్లతో బయటకు వచ్చి ఉంటే, రెస్క్యూ టీమ్‌లు లేదా స్థానికులు వారిని గుర్తించి ఉండేవారు. అలా జరగకపోవడం వల్ల విమానం నియంత్రణ కోల్పోయి శరవేగంగా కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఐదుగురు క్రూ సభ్యులు ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశం ఎక్కువ. ఇది కేవలం సాంకేతిక వైఫల్యం కాదు, మానవ జీవితాలను ప్రభావితం చేసిన దుర్ఘటనగా మారింది.

కార్గోలో ఏం తరలిస్తున్నారు..
ఈ కార్గో ఫ్లైట్‌లో అసలు ఏమి లోడ్‌ చేశారనేది ప్రజల్లో, మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కార్గో విమానాల్లో సాధారణంగా వాణిజ్య సరుకులు, పరికరాలు లేదా ప్రత్యేక వస్తువులు ఉంటాయి. దీని గురించి స్పష్టత రాకపోవడం వల్ల వివిధ రకాల ఊహాగానాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు నివారించాలంటే కార్గో మానిఫెస్ట్‌లు మరింత కఠినంగా పరిశీలించాలి.

పాకిస్తాన్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది..
పాకిస్తాన్‌ అధికారులు ఈ సంఘటనకు కారణాలు తేల్చడానికి విచారణ ప్రారంభించారు. విమాన బ్లాక్‌ బాక్స్‌ రికవరీ, వాతావరణ నివేదికలు, నిర్వహణ చరిత్ర వంటివి పరిశీలించడం జరుగుతుంది. ఇలాంటి విచారణలు సాధారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థల సహకారంతో జరుగుతాయి. ఫలితాలు వచ్చే వరకు ఊహాగానాలు కొనసాగుతాయి.

ఈ సంఘటన విమానయాన భద్రతా వ్యవస్థలోని బలహీనతలను బయటపెట్టింది. బోయింగ్‌ 737 వంటి విమానాల్లో నావిగేషన్‌ సిస్టమ్‌లు ఎంత ముఖ్యమైనవో తెలుస్తుంది. సైనిక బలగాలు శోధనలో ఇన్వాల్వ్‌ అవ్వడం సంఘటనను సాధారణ విమాన ప్రమాదం కాకుండా మరింత తీవ్రంగా చేస్తుంది. కార్గో లోడ్‌ గురించి జరుగుతున్న చర్చలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఘనంగా జరిగిన హీరోయిన్ కలర్స్ స్వాతి 2వ పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరంటే!

Colors Swathi

Colors Swathi : ప్రముఖ హీరోయిన్ స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి నేడు గ్రాండ్ గా రెండవ వివాహం చేసుకుంది. తనతో ‘మంత్స్ ఆఫ్ మధు’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి తో ఆమె నేడు వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా ఈ జంట ఇన్ స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గత కొంతకాలంగా కలర్స్ స్వాతి తన మొదటి భర్త వికాస్ వాసు కి విడాకులు ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. తన సినిమా ప్రొమోషన్స్ సమయంలో మీడియా రిపోర్టర్స్ ఈ అంశంపై ప్రశ్నలు అడగ్గా, కలర్స్ స్వాతి కోపం తెచ్చుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో తాను కొత్త రిలేషన్ లో ఉన్నట్టు ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు కానీ , సోషల్ మీడియా లో రూమర్స్ మాత్రం చక్కర్లు కొడుతూనే ఉండేవి.

అవి రూమర్స్ కావని , నిజమేనని నేడు ఒకే ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది ఈ జంట. 2018 వ సంవత్సరం లో ఈమె వికాస్ వాసు ని పెళ్లి చేసుకుంది. ఈయన ఒక మలయాళీ పైలట్. రెండేళ్లకు పైగా వీళ్ళ దాంపత్య జీవితం సజావుగానే సాగింది , కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ , విబేధాలు వచ్చి దూర అయ్యారు. 2022 వ సంవత్సరం లో అధికారికంగా వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత 2023 వ సంవత్సరం లో ‘మంత్స్ ఆఫ్ మధు’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈమెకు డైరెక్టర్ శ్రీకాంత్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అది క్రమేణా ప్రేమగా మారి , నేడు పెళ్ళికి దారి తీసింది. ఈ వివాహ మహోత్సవం ఇరువురి కుటుంబ సభ్యులు , మిత్రుల సమక్ష్యం లో జరిగింది.

ఈ కార్యక్రమానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా విచ్చేసారు. ఈయన కలర్స్ స్వాతి కి మంచి స్నేహితుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక స్వాతి కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె చేతుల్లో ఎలాంటి సినిమా లేదు. 2017 వ సంవత్సరం వరకు ఈమె తన కెరీర్ లో హీరోయిన్ గా పీక్ ఫేస్ ని చూసింది. 2018 లో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక ఆ తర్వాత విడాకులు తీసుకున్నాక 2022 వ సంవత్సరం లో ‘పంచతంత్రం’ అనే చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఆమె నటించిన ‘మంత్స్ ఆఫ్ మధు’ కూడా సరిగా ఆడలేదు. ఇప్పుడు పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేస్తుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న కలర్స్ స్వాతి రెండవ పెళ్లి ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

మరోసారి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా..వీడియో వైరల్..

Tarun Bhaskar Eesha Rebba
Tarun Bhaskar Eesha Rebba

Tarun Bhaskar Eesha Rebba: గత కొంత కాలంగా టాలీవుడ్ లో మోస్ట్ హాట్ టాపిక్ గా నిల్చిన జంట తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా. వీళ్లిద్దరు చాలా రోజుల నుండి పీకల్లోతు ప్రేమలో ఉన్నారని , ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు తరుణ్ భాస్కర్ కానీ , ఇటు ఈషా రెబ్బా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ అనేక సందర్భాల్లో వీళ్లిద్దరు కలిసి కనిపిస్తూ మీడియా కి తాము నిజంగానే డేటింగ్ చేస్తున్నామని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇక నేడు వీళ్లిద్దరు హైదరాబాద్ విమానాశ్రయం లో కలిసి నడుస్తూ కనిపించడంతో మరోసారి వీళ్లిద్దరి పెళ్లి వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్టు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ , ఒక ఇంటర్వ్యూ లో మాత్రం ఈషా రెబ్బా గురించి తరుణ్ భాస్కర్ గొప్పగా చెప్పుకొచ్చారు.

తనకు ఈషా రెబ్బా స్నేహితురాలికంటే చాలా ఎక్కువ అని , తన జీవితం అతి ముఖ్యమైన వ్యక్తి అని , సరైన సమయం వచ్చినప్పుడు ఈ విషయం పై మాట్లాడుతానని చెప్పుకొచ్చారు తరుణ్ భాస్కర్. ఫ్రెండ్ కంటే ఎక్కువ అని అన్నారంటే , కచ్చితంగా తన కాబోయే భార్య అని అర్థం. విజయ్ దేవరకొండ , రష్మిక జంట లాగా , ఎందుకు ఇంకా నాన్చడం , అధికారికంగా చెప్పేయొచ్చు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ వీళ్ళ రిలేషన్ పై కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి రీసెంట్ గానే హీరో హీరోయిన్లు గా ‘ఓం శాంతి శాంతి శాంతిః ‘ అనే చిత్రం లో నటించారు. మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘జయ జయ జయ జయహే’ చిత్రానికి ఇది రీమేక్.

జనవరి 30 వ తారీఖున విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమాకు విడుదలకు ముందే వీళ్లిద్దరి మధ్య లవ్ రిలేషన్ షిప్ ఉంది. అంతకు ముందు వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమాకు కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది మిస్టరీ. ఈ జంటలో ఎవరో ఒకరు చెప్తే కానీ , వీళ్ళ మధ్య పరిచయం ఎలా మొదలైంది , ప్రేమ ఎలా పుట్టింది అనే విషయాలపై క్లారిటీ రాదు. ఇక వీళ్ళ కెరీర్ విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ‘ఈ నాగరినికి ఏమైంది 2’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈషా రెబ్బా అయితే ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది , ఆమె చేతిలో ఎలాంటి సినిమా కానీ , వెబ్ సిరీస్ కానీ లేదు.

ఏమి మాట్లాడాలన్నా భయం వేస్తోంది అంటూ నాగార్జున హాట్ కామెంట్స్..

Nagarjuna
Nagarjuna

Nagarjuna: అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ని నేడు ఏర్పాటు చేశారు మూవీ టీం. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న అక్కినేని అఖిల్ , ఈ సినిమాతో ఎలా అయినా కం బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం అఖిల్ కి ఎంత ముఖ్యమో , హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే కి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈమె కెరీర్ లో చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే. ఇప్పుడు ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఆమె కెరీర్ కి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీళ్లిద్దరికీ ఈ సినిమా సక్సెస్ అత్యంత అవసరం. ఇకపోతే నేడు ప్రెస్ మీట్ లో నాగార్జున మీడియా గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులను చూస్తుంటే నాకు నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆరోజుల్లో సినిమా ప్రొమోషన్స్ అంటే కేవలం ఆరుగురు జర్నలిస్టులు , ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్ మాత్రమే ఉండేవారు. అప్పట్లో ఇప్పటి లాగా చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కాదు , నిరంతరం రికార్డింగ్ చేసే కెమెరాలు , డిజిటల్ రికార్డ్స్ వంటివి లేకపోవడం తో మాలో ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు. హాయిగా ప్రొమోషన్స్ , ప్రెస్ మీట్స్ వంటివి పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఏ కెమెరాలు పెడుతారో , ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు , మేము చెప్పే సమాధానాలను ఎలా వక్రీకరించి చూపిస్తారో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రెస్ మీట్ అంటేనే వణుకు పుట్టే పరిస్థితి’ అంటూ నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇక ‘లెనిన్’ విషయానికి వస్తే , ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన కుర్ర హీరోలు కూడా భారీ హిట్స్ ని అందుకొని , మార్కెట్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ అఖిల్ మాత్రం ఎక్కడ మొదలెట్టాడో , అక్కడే ఆగిపోయాడు , ఆయన కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. అందుకే లెనిన్ తో ఎలా అయినా హిట్ కొట్టి తన సత్తా చాటాలని అనుకుంటున్నారు. ఇక నాగార్జున కూడా తన సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి , కేవలం ‘లెనిన్’ మీదనే ఫోకస్ పెట్టారు. ఈ సినిమా ఔట్పుట్ పై ఆయన చాలా నమ్మకం తో ఉన్నారు. మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

నా శాఖలో వేలు ఎలా పెడ్తడు.. కడియం శ్రీహరిపై కొండా ఫిర్యాదు!

Kadiyam Srihari Vs Konda Surekha
Kadiyam Srihari Vs Konda Surekha

Kadiyam Srihari Vs Konda Surekha: వరంగల్‌ రాజకీయాలు అధికారా కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారాయి. మొదట మంత్రి కొండా సురేఖ ఫోన్‌ టాపింగ్‌ విషయంలో హీరో నాగార్జున కుటుంబంపై చేసిన ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. తర్వాత కొండా మురళి జిల్లా రాజకీయాల్లో రచ్చ లేపారు. తాజాగా కడియం హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆలయాల సమస్యలపై ఆయన నిర్వహించిన సమావేశం జిల్లా మంత్రి కొండా సురేఖకు కోపం తెప్పించింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో ససమావేశం నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికి మూడు పేజీల లేఖ రాశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

గొడవకు కారణం ఏంటి?
బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమాచారం తనకు ఇవ్వకుండా జరిగిందని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంత్రిగా తన అధికార పరిధిని బేఖాతరు చేయడమని, ప్రభుత్వ వ్యాపార నియమాల ఉల్లంఘన అని సురేఖ అభిప్రాయపడ్డారు. ఆలయాలు, దేవాదాయ భూములు, శాఖ సమస్యలపై ఎమ్మెల్యే నేరుగా అధికారులకు ఆదేశాలివ్వడం సరికాదని, ఇది పరిపాలనా వ్యవస్థలో అయోమయం సృష్టిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

సురేఖఆరోపణలు ఇవీ..
తాజా వివాదం నేపథ్యంలక్ష మంత్రి కొండా సురేఖ కడియం నుంచి వివరణ కోరాలి, మంత్రి అధికారాలను గౌరవించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి, పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. గతంలో కూడా వరంగల్‌ ప్రాంత వ్యవహారాల్లో కడియం జోక్యం చేసుకుంటున్నారని సురేఖ ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

స్పందించిన కడియం..
ఈ ఫిర్యాదుపై కడియం శ్రీహరి పరోక్షంగా స్పందిస్తూ, తాను దేవాదాయ శాఖపై ఎలాంటి అధికారిక సమీక్ష నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఆలయాల సమస్యలను మాత్రమే అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, సమీక్ష చేసే హక్కు తనకు లేదని తాను బాగా తెలుసుకున్నానని తెలిపారు. ప్రోటోకాల్‌ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కడియం సీనియర్‌ రాజకీయ నాయకుడు, తన నియోజకవర్గంలోని ఆలయ సమస్యలపై ఆసక్తి చూపడం సహజమే అయినప్పటికీ, శాఖాధికారులతో నేరుగా సమీక్ష చేయడం వివాదాస్పదమైంది.

వరంగల్‌లో వివాదాస్పద రాజకీయాలు
కొండా సురేఖ–కడియం శ్రీహరి మధ్య ఇది మొదటి వివాదం కాదు. వరంగల్‌ జిల్లా వ్యవహారాల్లో, ముఖ్యంగా ఆలయాలు, భూముల సంబంధిత అంశాల్లో ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు గతంలోనే ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో అధికార విభజన, నియోజకవర్గ స్థాయి ప్రభావం, మంత్రి–ఎమ్మెల్యే సంబంధాలు ఇలాంటి ఘర్షణలకు కారణమవుతున్నాయి. దేవాదాయ శాఖ ఆలయాల అభివృద్ధి, భూముల నిర్వహణ, నిధులు వంటి సున్నితమైన అంశాలతో వ్యవహరిస్తుంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఆలయ సమస్యలను పరిష్కరించాలని కోరుకోవడం సహజం, కానీ అధికారిక సమీక్షలు మంత్రి ఆధ్వర్యంలోనే జరగాలి.

పరిపాలనా ప్రోటోకాల్‌..
ఈ ఘర్షణ అధికార పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపాన్ని బయటపెడుతోంది. రాజ్యాంగం ప్రకారం మంత్రులకు శాఖలపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కాబట్టి సమస్యలను తీసుకెళ్లవచ్చు, కానీ అధికారులతో నేరుగా సమీక్షలు నిర్వహించడం వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇలాంటి సంఘటనలు అధికారుల్లో అయోమయం కలిగిస్తాయి, నిర్ణయాలు ఆలస్యం కావచ్చు.

రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు.. మిగిలింది కొన్ని గంటలే!

SBI PO Recruitment 2026
SBI PO Recruitment 2026

SBI PO Recruitment 2026: గ్రాడ్యుయేట్లకు బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్‌కు అరుదైన అవకాశం ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరింది. మొత్తం 1,500 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే 11 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ రోజు(బుధవారం)రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది యువ గ్రాడ్యుయేట్లకు బ్యాంకింగ్ సెక్టార్‌లో మంచి కెరీర్ ఇస్తుంది .

అర్హతలు ఇవీ..
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు వయసు సడలింపు వర్తిస్తుంది. ఇంజనీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఏ బ్రాంచ్ అయినా డిగ్రీ ఉంటే చాలు.

దరఖాస్తు ఫీజు..
సాధారణ వర్గాలకు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు ఫీజు పూర్తిగా మినహాయింపు ఉంది. ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మంచి సౌకర్యం కల్పిస్తుంది.

జీతం, ఇతర ప్రయోజనాలు..
ఎంపికైన వారికి నెలకు దాదాపు రూ.లక్ష వరకు జీతం లభిస్తుంది. ఇందులో బేసిక్ పే, డీఏ, హౌస్ రెంట్ అలవెన్స్ వంటివి ఉంటాయి. దీంతో పాటు మెడికల్ ఫెసిలిటీలు, లోన్స్, పెన్షన్, ఉద్యోగ భద్రత వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎస్బీ ఐలో పీవో గా చేరిన తర్వాత కెరీర్‌లో వేగంగా పైకి రావచ్చు. ఇది ప్రైవేట్ సెక్టార్‌లోని చాలా ఉద్యోగాల కంటే స్థిరత్వం ఇస్తుంది.

పోటీ ఎక్కువ..
ఈ అవకాశం చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, పోటీ అత్యంత తీవ్రంగా ఉంది. 1,500 పోస్టులకు 11 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం అంటే ప్రతి పోస్టుకు సుమారు 733 మంది పోటీ పడుతున్నారు. ఇంత భారీ సంఖ్యలో విజయం సాధించాలంటే కేవలం దరఖాస్తు చేసుకోవడం సరిపోదు.

మూడు దశల్లో పరీక్ష..
పీవో పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ దశలను దాటాలంటే రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ వంటి వాటిలో బలమైన పునాది అవసరం. చాలా మంది గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు ఎందుకంటే సిద్ధం లేకుండా దరఖాస్తు చేసుకుంటారు.

చివరి క్షణంలో దరఖాస్తు చేసుకునేవారు సర్వర్ సమస్యలు, పేమెంట్ ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఎక్కువ. కాబట్టి వీలైనంత త్వరగా దరఖాస్తు పూర్తి చేయండి. ఈ అవకాశం కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. అర్హత ఉన్న వారందరూ ఈ రోజే దరఖాస్తు చేసుకోండి.