HomeNewsPawan Kalyan: పవన్ ఎందుకు సైలెంట్ అయిపోయారు..? కారణమేంటి?

Pawan Kalyan: పవన్ ఎందుకు సైలెంట్ అయిపోయారు..? కారణమేంటి?

Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. మొదటి నుంచి కాస్త దూకుడు గానే వ్యవహరించారు. మొదట టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ టైంలో జనసేనకు తక్కువ సీట్లే దక్కడంతో ఏ మాత్రం డిమాండ్ చేయకుండా ఉండిపోయారు. తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ను పట్టించుకోకపోవడంతో ఆయన కమ్యూనిస్టు పార్టీలకు మద్దతు తెలిపారు.

తర్వాత రాజకీయ పరిణామాల వల్ల బీజేపీకి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. కానీ ఇటీవల విశాఖ ఉక్కు కోసం ఏర్పాటు చేసిన సభలో పవన్ బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేసినా.. అవి అంతగా పేలినట్టు అనిపించలేదు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఇక ఆయన ఎప్పుడు ఎలాంటి సభ పెట్టిన వైసీపీ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan

Also Read: హ్యాట్రిక్ సీఎం కావాలంటున్న కేసీఆర్.. రంగంలోకి దిగిన పీకే షాడో బృందం!

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవలే జిల్లాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని దాదాపుగా అందరూ సమర్థించిన జిల్లాల పేర్ల విషయంలో కొందరు కొన్ని కామెంట్స్ చేశారు. పలు పేర్లు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ జనసేన అధినేత మాత్రం వీటిపైన ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. మరో వైపు ఇటీవలే ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంపైనా నెగెటివ్‌గా కానీ, పాజిటివ్‌గా ఇంకా పవన్ ఎలాంటి కామెంట్ చేయలేదు. మొన్నటి వరకు దూకుడు ప్రదర్శించిన పవన్.. ప్రస్తుతం ఎందుకు సైలెంట్ అయ్యారనేది అర్థం కావడం లేదు.

ఆయన ఎందుకు పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.. రాష్ట్రం ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే స్పందించే జనసేనాని ప్రస్తుతం మౌన దీక్ష చేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన దీని వెనకాల ఏమైనా ప్లాన్ వేస్తున్నారా? అనేది మాత్రం తెలియడం లేదు. మరో వైపు జనసైనికులు కూడా ఎక్కడా ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. అయితే ఇదంతా పవన్ ముందస్తు ప్లాన్ లో భాగమేనా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై ఆయన ఏమైనా ఆలోచనలు చేస్తాన్నారా? అని సైతం కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రాజధాని విషయంలో జగన్ సైలెంట్.. అది భారీ స్కెచ్‌లో భాగమేనట..

 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper