పశ్చమ బెంగాల్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలో చోటు చేసుకున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తృణమూల్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. అయితే ఎవరు హత్య చేసిందనేది తెలయరాలేదు. రాష్ట్రంలోని హౌరాలోని బోటానికల్ గార్డెన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. షాలిమార్ రైల్వేస్టేషన్ వైపు బైక్ పై వెళ్తున్న అతన్ని అడ్డుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చినట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. అంతకుముందు కాల్పులకు గురైన అతడు రక్తపు మడుగులో ఉండగా కొందరు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సదరు వ్యక్తి మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా మరణించిన వ్యక్తి టీఎంసీ యువజన విభానం నేతగా గుర్తించారు. దీంతో హౌరాలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. కొందరు రోడ్డుపై ద్విచక్రవాహనాలను తగలబెట్టారు.