
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,37,119 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 551 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,21,641కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 5,82,649 యాక్టివ్ కేసులు ఉండగా.. 74,32,829 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా 24 గంటల్లో 59,454 మంది డిశ్చార్జ్ అయ్యారు.