అత్యంత ప్రజాదరణగుడ్ న్యూస్.. డిసెంబర్ 25నుంచి భారత్ లో కరోనా వాక్సిన్ పంపిణీ.. ఆరోజు ప్రత్యేకత ఏంటీ?

గుడ్ న్యూస్.. డిసెంబర్ 25నుంచి భారత్ లో కరోనా వాక్సిన్ పంపిణీ.. ఆరోజు ప్రత్యేకత ఏంటీ?

Corona Vaccine

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే బ్రిటన్ దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయడం షూరు చేయగా అక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదు. దీంతో భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్ ను డిసెంబర్ 25ను పంపిణీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

Also Read: వరద సాయం కొనసాగుతుంది.. బాధితులు అధైర్య పడొద్దు: జీహెచ్ఎంసీ

కరోనా వ్యాక్సిన్ ను ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం డిసెంబర్ 25 నుంచి కోవిడ్-19టీకాను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆరోజుకు ఏదైనా ప్రత్యేకత ఉందా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఉండగా మరో విశేషం కూడా ఉందని తెలుస్తోంది. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి కూడా అదేరోజు కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 25న ప్రధాని మోదీ సాంకేతికంగా వ్యాక్సిన్ ను ప్రారంభిస్తారు. అనంతరం అన్ని రాష్ట్రాలకు కేంద్రం కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేయనుంది.

తొలిదశలో 3కోట్ల వ్యాక్సిన్లను నిల్వ ఉంచేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. తొలుత దేశంలోని ఫ్రంట్ లైన్ వారియన్స్ కు వ్యాక్సిన్ వేస్తారు. ఆ తర్వాత ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు.. మిగతా రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి జనవరి 15వరకు సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నాయి.

Also Read: కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులకు కేంద్రం సుముఖం?

కోవిడ్-19 వ్యాక్సిన్ వేసిన తర్వాత ఓ అరగంటపాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటే వైద్యులు ఇంటికి పంపిస్తారు. ఈక్రమంలోనే పలు కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఒకరికి ఏ కంపెనీ వ్యాక్సిన్ ఇస్తారో.. అదే వ్యక్తి 15రోజుల తర్వాత తిరిగి అదే కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.

దీనికోసం వైద్య సిబ్బంది తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం మైలేజ్ గురించి ఆలోచించకుండా వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Trisha : హీరోయిన్ త్రిషకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? నా జీవితాన్ని శూన్యం చేసి వెళ్లిపోయాడంటూ కామెంట్స్!

రెండు దశాబ్దాల నుండి సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఒకరు త్రిష కృష్ణన్. తెలుగు, తమిళ భాషల్లో ఈమె దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది.

Christmas : రానే వచ్చేసింది క్రిస్మస్.. ఇలా విషెష్ తెలియజేసేయండి

ఈ క్రిస్మస్ పండుగ రోజు ప్రార్థనలు, వేడుకలు, కమ్యూనిటీ సందర్శనల సమయం వంటివి ఎక్కువగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. మరి ఎలాగో చూద్దాం.

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...
Exit mobile version