Homeజాతీయ వార్తలుDelhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ వేర్పాటు వాదులు అందులోకి ప్రవేశించారు. సరిగ్గా గణతంత్ర దినోత్సవం జరిగిన తర్వాత ఎర్రకోట మీద ఖలీస్థానీ జెండా ఎగరవేశా. దీంతో ఈ రైతు ఉద్యమం వెనుక ఉన్న అజెండా ఏమిటో అందరికీ అర్థమైంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే ఆ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. తద్వారా యూపీ ఎన్నికల్లో విపక్ష పార్టీలు ఊహించని విధంగా స్కెచ్ వేశారు. దీంతో ఆ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. మనదేశంలో ఉద్యమాల వెనుక ఉన్న శక్తులు ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయో నాడు ఈ సంఘటన బయటకు తెలిసేలా చేసింది.

ఇప్పుడు ఢిల్లీలో కొంతమంది ఉద్యమాలు చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నీటి పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు వంటిఘటనలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇటీవల సోనం వాంగ్ చుక్ నిరధిక నిరాహార దీక్షకు దిగారు. ఆ తర్వాత ఆయన దీక్షను ప్రభుత్వం విరమింపజేసింది. ఆయన ఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సరిగా నిన్న ఢిల్లీలో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. చలో పార్లమెంట్ నినాదంతో ఢిల్లీ నగరంలో హడావిడి చేశారు. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడంతో అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కిసాన్ ఘాట్ వద్ద రైతులు నిరసన తెలపడం మొదలుపెట్టారు. వేల సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. భారత్ – అమెరికా వాణిజప్పంలో భాగంగా తక్కువ ధరకు.. రాయితీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. అందువల్లే శంభు బార్డర్ (పంజాబ్, హర్యానా సరిహద్దు) వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకున్నారు.

అటు బొద్దింకలు.. ఇటు రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి బిజెపికి విపత్కర పరిస్థితి తప్పదా అంటూ విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా రైతుల ఉద్యమం ముసుగులో చాలామంది ఢిల్లీలో తిష్ట వేసుకున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే పోలీసులు సమర్థవంతంగా అడ్డుకోవడంతో వారి పాచికలు పారలేదు. ఇప్పుడు మళ్లీ నీట్.. అమెరికా ఒప్పందం వంటి వాటిని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. అయితే దీని వెనక కూడా విదేశీ శక్తులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అందువల్లే ఈ ఉద్యమాలను ఉక్కుపాదంతో తొక్కి వేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version