spot_img
Homeక్రీడలుIND vs AUS Test series : మూడు టెస్టులు ముచ్చటగా మూడు రోజులే: బీసీసీఐ...

IND vs AUS Test series : మూడు టెస్టులు ముచ్చటగా మూడు రోజులే: బీసీసీఐ పై పేలుతున్న మీమ్స్‌

IND vs AUS Test series : యాషెస్‌ తర్వాత ఆ స్థాయిలో ఆసక్తి రేపేది బోర్డర్‌, గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌. గత రెండు టోర్నీలను భారత్‌ గెలుచుకుంది. ఈసారి ఆతిథ్యం భారత్‌ ఇచ్చింది. నాలుగు టెస్టుల సీరిస్‌లో భాగంగా భారత్‌ రెండు, ఆస్ట్రేలియా ఒకటి గెలుచుకున్నాయి. మొదటి టెస్ట్‌, రెండో టెస్ట్‌ నాగ్‌ పూర్‌, ఢిల్లీలో భారత్‌ గెలిచింది. నాగ్‌ పూర్‌లో అయితే ఇన్నింగ్స్‌ తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గత కొన్నేళ్లుగా ఇన్నింగ్స్‌ ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను నేలకు దించింది. అంతే కాదు టెస్ట్‌ల్లో ఒకటో ర్యాంక్‌ జట్టుగా ఇండియాలోకి అడుగు పెట్టిన ఆస్ట్రేలియాను గింగిరాలు తిప్పారు. అయితే ఇండోర్‌లో మాత్రం భారత్‌కు చుక్కెదురయింది.

వికెట్లు నేలకూల్చారు

ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టులు మూడో రోజుల్లోనే ముగియడం గమనార్హం. నాగ్‌పూర్‌, ఢిల్లీ, ఇండర్‌ ఇలా మూడు వేదికల్లోనూ మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిశాయి. సాధారణంగా టోర్నీకి ముందు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్‌లు నమోదవుతాయని అందరూ భావించారు. కానీ వారి అంచనాలను మైదానాలు తలకిందులు చేశాయి. బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారిస్తారూ అనుకుంటే, బౌలర్లు వికెట్లను నేలకూల్చారు. ఇప్పటి వరకూ జరిగిన టెస్టుల్లో ఇండియా నుంచి అశ్విన్‌, రవీంద్రజడేజా, ఆస్ట్రేలియా నుంచి లయాన్‌, కునేమాన్‌, ముర్ఫీ భారీగా వికెట్లు నేలకూల్చి ఆయా జట్ల విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు.

మూడు రోజులేనా?

సాధారణం టెస్టులు ఐదు రోజుల పాటు సాగుతాయి. అనూహ్య పరిస్థితుల్లోనే మూడు లేదా నాలుగు రోజుల్లో ముగుస్తాయి. కానీ ఇప్పటి వరకూ జరిగిన టెస్టులు మొత్తం మూడు రోజుల్లోనే ముగిశాయి. ఒక్క ఢిల్లీలోనే మధ్యాహ్నం వరకు సాగింది. మిగతా నాగ్‌పూర్‌, ఇండోర్‌లో అయితే తొలి సెషన్‌లోనే ముగిశాయి. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగియడంతో చివరి నాలుగు, ఐదు రోజుల్లో విక్రయించిన టిక్కెట్ల సొమ్మును తిరిగి ఇచ్చేశారు.

మైదానాల కూర్పు ఇలాగేనా

సాధారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మైదనాలు బౌన్సీగా ఉంటాయి. ఒక్కోసారి అవి కూడా బ్యాటర్లకు అనుకూలిస్తాయి. కానీ అదేం విచిత్రమో గానీ ఇండియాలో ఎన్నడూ లేవి విధంగా మైదానాలు బౌన్సీగా మారాయి. అంతే కాద ఉదయం పేసర్లకు, మధ్యాహ్నం నుంచి స్పిన్నర్లకు అనుకూలించడం మొదలు పెట్టాయి. తోపు తురం లాంటి బ్యాటర్లను కూడా ముప్పుతిప్పలు పెట్టాయి. ‘డిఫెన్స్‌ ఆడుదామంటే ప్యాడ్లను తాకుతోంది. హుక్‌ చేద్దామంటే గాల్లోకి లేస్తోంది. స్లిప్‌లోకి ఆడుదామంటే వికెట్లను గిరాటేస్తోంది’ అంటూ బ్యాటర్లు వాపోతున్నారంటే మైదానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగుస్తుండటంతో అభిమానులు బీసీసీఐ పెదవి విరుస్తున్నారు. ‘మిగతా దేశాల్లో ఏమోగాని.. ఇండియాలో మాత్రం టెస్ట్‌ మ్యాచ్‌ల్లో నిడివిని మూడు రోజులకే పరిమితం చేశారంటూ’ బీసీసీఐపై అభిమానులు మీమ్స్‌ వర్షం కురిపిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper