Homeలైఫ్ స్టైల్full work : ఫుల్ వర్క్ లో ఉన్నప్పుడు నిద్ర డిస్టర్బ్ చేస్తుందా?

full work : ఫుల్ వర్క్ లో ఉన్నప్పుడు నిద్ర డిస్టర్బ్ చేస్తుందా?

full work : ఫుల్ గా పని ఉన్నప్పుడు, అర్జెంట్ వర్క్ లో ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఎవరితో అయినా మీటింగ్ లో ఉన్నప్పుడు నిద్ర వస్తే ఎంత చిరాకుగా ఉంటుందో కదా! మరి ఈ సమస్య నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్లికల్ మీకోసమే. మధ్యాహ్నం వేళల్లో పని(Work) చేస్తున్నప్పుడో, సీరియస్‌గా పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు కూడా మీలో చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. కొందరికి భోజనం తర్వాత శరీరం పనిచేసేందుకు ఏమాత్రం ఒప్పుకోదు. దీంతో ఏ పని చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఆ పని మీద దృష్టి పెట్టలేం. ఇది చాలా మందిలో మామూలుగా ఉండే సమస్యేనే కానీ, రోజంతా ఇలాగే ఉంటే వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ చేయడం చాలా కష్టం. అందువల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టాలి అనుకుంటే ఈ నిపుణులు టిప్స్ పాటించండి.

డిన్నర్‌: రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయవద్దు. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే భోజనం తర్వాత అంటే 3 నుంచి 4 గంటల తర్వాత మీరు నిద్ర పోవడం బెస్ట్. వీలైనంత తొందరగా రాత్రి భోజనం ఫినీష్ చేసుకోవాలి. ఏ ఆహారం అయినా సరే.. లేట్‌ నైట్స్‌ తినకుండా త్వరగా భోజనం చేసుకోవడం అలవాటు చేసుకోండి. దీని వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

స్క్రీన్‌ టైమ్‌: చాలా మంది ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ పరికరాలతో జీవితం గడిపేస్తున్నారు. మనిషి జీవితానికి ఈ పరికరాలకు వీడదీయరాని అనుబంధం ఏర్పడినట్టుగా మారింది. ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతున్నారు. అవసరానికి మించి స్క్రీన్‌లకు అతుక్కుపోతున్నారు. తక్కువ వెలుతురులో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది అంటున్నారు నిపుణులు. ఈ ఎలక్ట్రానిక్ పరికరకాల ఉపయోగం మీ భోజనానికి ముందే ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మీరు కాస్త వీటికి దూరంగా ఉండటమే బెటర్.

నిద్రలో రెగ్యులారిటీ: మంచి నిద్ర కావాలి అనుకుంటున్నారా? అయితే చుట్టూ ఉండే వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. పడుకునే ముందు గదిలోకి ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోండి. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది. మరో ముఖ్యమైన విషయం కచ్చితంగా 6 నుంచి 8 గంటల నిద్ర పోవడం అవసరం. చిరాకు, అలసట, నీరసం వంటివి దరి చేరవు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

రాత్రి వేళల్లో టీ, కాఫీలకు దూరం: కాఫీ, టీల్లో ఉండే కెఫిన్‌ నిద్రను దూరం చేస్తుంది అంటున్నారు నిపుణులు. రాత్రి సమయంలో వీటిని తాగడం వల్ల నిద్ర రాదు. భోజనం తర్వాత కాఫీ, టీలు తాగకూడదు. రాత్రి పడుకునే ముందు పుస్తకం చదవటం అలవాటు చేసుకోండి.

ఆల్కహాల్‌కు దూరం: ఆల్కహాల్‌ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమి శరీర ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది అంటున్నారు నిపుణులు. దీంతో ఏ పనిని పూర్తిగా చేయలేరు కాబట్టి ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగండి. దీని వల్ల మీకు హాయిగా నిద్రపడుతుంది. సో మధ్యాహ్నం మీకు నిద్ర రాదు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper