భారత సైనికులు ఉగ్రవాదుల మధ్య జమ్ముకశ్మీర్ లో ఎదురుకాల్పులు జరిగాయి. అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మృతులను జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో వారి కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.