భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టుకూ వర్షం అంతరాయం కలిగిస్తోంది. చిరుజల్లులు కురవడంతో మ్యాచ్ టాస్ వేయలేదు. ఉదయం నుంచి వాతావరణం ప్రశాంతంగానే ఉండటంతో మ్యాచ్ సవ్యంగానే సాగుతుందని అంతా ఆశించారు. సరిగ్గా టాస్ కు ముందే చినుకులు మొదలవ్వడంతో లార్డ్స మైదనం సిబ్బంది కవర్లు కప్పేశారు. కాగా ఇంగ్లిష్ పేసర్ జిమ్మీ అండర్సన్ మ్యాచ్ ఆడబోతున్నట్లు తెలిసింది. అతడికి కండరాలు పట్టేయడంతో బుధవారం సాధన చేయలేదు.