గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద మరింత పెరుగుతోంది. కాఫర్ డ్యాం వద్ద 28.4 అడుగులకు వరద నీటిమట్టం చేరుకుంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా స్పిల్వే గేట్ల ద్వారా దిగువకు 1,25000 నీటిని వదిలేస్తున్నారు. దీంతో ధవళేశ్వర బ్యారేజీలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది.