టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసు విచారణకు కొంత గడువు కావాలని నటి రకుల్ ప్రీత్ సింగ్ కోరారు. కేసు విచారణలో భాగంగా ఈ నెల 6న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కాగా వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉండడం చేత తాను ఇప్పుడే విచారణకు హాజరు కాలేనని.. కొంత గడువు ఇవ్వాలని ఆమె ఈడీని కోరారు. దీంతో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఈడీ విచారణకు రకుల్ హాజు అవుతారా ? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొని ఉంది.