
ఓబీసీల జాబితా రూపకల్పనలో రాష్ట్రాలకు ఇదివరకు ఉన్న అధికారాలను పునరుద్ధరించడానికి వీలు కల్పించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్ సభ ఆమోదం తెలపగా.. బుధవారం రాజ్యసభలో సైతం విపక్ష సభ్యులు ఏకతాటిపైకొచ్చి ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. రాజ్యసభలో ఈ బిల్లును సామాజిక న్యాయం- సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్ ప్రవేశ పెట్టారు. బిల్లు ఆమోదం అనంతరం మోదీ సహా వివిధ పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇదొక చరిత్రాత్మక అడుగు అని, దేశంలో 671 కులాలు దీనిద్వారా రిజర్వేషన్లు ప్రయోజనాన్ని పొందనున్నాయని చెప్పారు.