tamilnadu
తమిళనాడు ప్రభుత్వం అక్టోబర్ 1నుండి 10-12తరగతుల విద్యార్థులకు క్లాస్ లు ప్రారంభించేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే విద్యార్థులు మాత్రం తమకు ఇష్టమైతేనే తరగతులకు వచ్చే వెసులుబాటు కలిపించింది. ఈ నిబంధన ప్రభుత్వ, ప్రైవేట్ విద్య సంస్థలకు వర్తిస్తుందని, కంటైన్మెంట్ జోన్లలో వుండే విద్యార్థులను, ఉపాధ్యాయులను అనుమతించమని స్పష్టం చేసింది. ఒక క్లాస్ లోని విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించి మొదటి బ్యాచ్ కు వారంలోని మొదటి మూడు రోజులు, రెండవ బ్యాచ్ కి చివరి మూడు రోజుల్లో తరగతులు నిర్వహించాలని తెలిపింది.
Also Read: రెండోసారి అధికారంలో దూకుడుగా మోడీ పరిపాలన