Homeజాతీయ వార్తలుNarendra Modi : చైనాకు చెక్ పెట్టిన నరేంద్ర మోడీ.. ఈ ప్లాన్ మామూలుగా లేదుగా..

Narendra Modi : చైనాకు చెక్ పెట్టిన నరేంద్ర మోడీ.. ఈ ప్లాన్ మామూలుగా లేదుగా..

ఇటీవల కాలంలో మన చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతాలలో పట్టు సాధించడానికి చైనా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ దేశంతో దోస్తీ కడుతోంది. బంగ్లాదేశ్ తో కూడా మైత్రి కొనసాగిస్తోంది. చివరికి చిన్న చిన్న దేశాలను కూడా వదిలిపెట్టడం లేదు. తద్వారా భవిష్యత్ కాలంలో ఏవైనా పరిణామాలు జరిగితే.. మన దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి చైనా అందించిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. సహజంగానే చైనా దుర్మార్గమైన దేశం. తన ప్రయోజనాల కోసం ఏమైనా […]

ఇటీవల కాలంలో మన చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతాలలో పట్టు సాధించడానికి చైనా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ దేశంతో దోస్తీ కడుతోంది. బంగ్లాదేశ్ తో కూడా మైత్రి కొనసాగిస్తోంది. చివరికి చిన్న చిన్న దేశాలను కూడా వదిలిపెట్టడం లేదు. తద్వారా భవిష్యత్ కాలంలో ఏవైనా పరిణామాలు జరిగితే.. మన దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి చైనా అందించిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. సహజంగానే చైనా దుర్మార్గమైన దేశం. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేసే దేశం. అలాంటప్పుడు చైనాతో జాగ్రత్తగా ఉండాలి. చైనా తో స్నేహం కొనసాగించే దేశాలతో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇదే సమయంలో వ్యూహాత్మక ధోరణి ప్రదర్శించాలి.

సరిగ్గా ఇదే ఆలోచనతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా దేశంలో పర్యటిస్తున్నారు. కీలకమైన ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే అక్కడితోనే నరేంద్ర మోడీ ఆగిపోవడం లేదు. చైనాకు ఏకకాలంలో చెక్ పెట్టే విధంగా ఇండోనేషియాతో ఆయన ఒప్పందాలకు కుదుర్చుకున్నారు. ఇందులో ప్రధానమైనది మలక్కా జల సంధి వద్ద నిర్మిస్తున్న సబాంగ్ పోర్ట్.

ఈ పోర్టును భారత్.. ఇండోనేషియా దేశాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తాయి. మలక్కా జల సంధి ద్వారా 40% గ్లోబల్ ట్రేడ్ జరుగుతుంది. చైనా టోటల్ మారీ టైం ట్రేడ్ 60 నుంచి 70% ఇక్కడ నుంచే సాగుతూ ఉంటుంది. ఈ జలసంధికి 100 మైళ్ళ దూరంలో భారత్.. ఇండోనేషియా కలిసి సభాంగ్ పోర్టు నిర్మిస్తున్నాయి. దీంతోపాటు భారత్ ఇండోనేషియా తో కలిసి అత్యంత వ్యూహాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.. ఇటీవల కాలంలో హార్మోజ్ జల సంధి మూతపడితే ప్రపంచం ఏ స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేటి ఆధునిక కాలంలో కూడా చాలావరకు సరుకు రవాణా జల సందుల మీదుగానే సాగుతూ ఉంది. అలాంటప్పుడు వ్యూహాత్మకంగా పోర్టులు నిర్మించుకుంటే భవిష్యత్తు కాలంలో వచ్చే ఇబ్బందులను సులువుగా ఎదుర్కోవచ్చు.

సబాంగ్ పోర్టు ద్వారా భారత చైనాకు చెక్ పెడుతుంది. ఎలాగంటే చైనాకు సంబంధించిన ట్రేడ్ లో సింహభాగం ఇక్కడి నుంచే కొనసాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు భారత్ ఇక్కడ పోర్ట్ నిర్మిస్తే.. చైనా ఒకవేళ భవిష్యత్తు కాలంలో తోక జాడించే కార్యక్రమాలకు శ్రీకారం చుడితే.. భారత్ ఇక్కడ అడ్డుకోవచ్చు. ఫలితంగా చైనాకు వాణిజ్యపరంగా ఎదురు దెబ్బ తగులుతుంది. చైనా జుట్టు మన చేతిలో ఉండాలంటే కచ్చితంగా ఇండోనేషియా మనకు అనుకూలంగా ఉండాలి. అన్నిటికంటే ఇక్కడి పోర్టు మీద మన పెత్తనం ఉండాలి. అందువల్లే నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper