టీమ్ ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఇంకా 21 ఏళ్ల కుర్రాడని, ప్రశాంతంగా ఉంటూనే వైఫల్యాల నుంచి నేర్చుకోవాలని దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్ లో 14 మ్యాచ్ ల్లో 440 పరుగులు చేసిన అతడు ఈసారి టోర్నీ వాయిదా పడకమందు ఆడిన ఏడు మ్యాచ్ ల్లో 132 పరుగులే చేశాడు. దాంతో అతడిపై ఒత్తిడి పెరిగిందని గావస్కర్ ఓ క్రీడా ఛానల్ తో అన్నాడు. గిల్ ఇలా ఉన్నపళంగా విఫలమవ్వడానికి కారణం నాకు తెలిసి అంచనాల పెరిగి ఒత్తిడికి గురవ్వడమే. ఐపీఎల్ కన్నా ముందు పరిస్థితులు వేరు. అతడో నమ్మకమైన యువ బ్యాట్య్ మన్ గా ఉన్నాడని తెలిపారు.