
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సైబరాబాద్ కు కొత్త సీపీగా స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది. 199 బ్యాచ్ కు చెందిన స్టీఫెన్ రవీంత్ర ప్రస్తుతం వెస్ట్ జోన్ ఐజీపీగా ఉన్నారు.