
తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కోలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం వీటిని వెలువరించింది. విధుల్లో చేరేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని 84 మంది విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. గతంలో 1,150 మంది విద్యుత్ ఉద్యోగులకు ఏపీ, తెలంగాణలకు 50 శాతం చొప్పున కేటాయించారు. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది.