నిన్న టీచర్స్ డే సందర్భంగా యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ లో వచ్చిన విద్యార్థినులపై మధ్యప్రదేశ్ లోని మచల్ పుర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. రంగుల దుస్తుల్లో వచ్చి బాలురును చెడగొడుతున్నారు. రేపటి నుంచి బట్టలు వేసుకోకుండానే బడికి రండి అంటూ అసభ్యకరంగా మాట్లాడారు. విద్యార్థినులు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేయడంతో హెడ్మాస్టర్ రాధేశ్యామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.