బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. గీత రచయిత జావేద్ అఖ్తర్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కంగనా వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. అంధేరి మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కంగనాపై పరువు నష్టం కేసు విచారణ మొదలు పెట్టింది. ఆ కేసును హైకోర్టులో కంగనా సవాల్ చేయగా, కోర్టు తిరస్కరించింది.