
కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ ఆందోళనలో స్థానిక బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నేత విష్ణువర్ధన్ పాల్గొన్నారు. పోలీసులు అడగడుగునా అడ్డుకొని బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి దారులు ఏర్పరచారని బీజేపీ నాయకులు అన్నారు. ఇలాంటి అరెస్టులకు బీజేపీ బయపడదని ఈ అంశంలో వెనుకంజ వేయదని నాయకులు అన్నారు. దేశద్రోహుల విగ్రహాలను మతతత్వ ఆలోచనలతో నిర్మాణం చేయడంపై పై సీఎం జగన్ తన వైఖరిని తెలియజేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు.
https://www.facebook.com/somuveerrajubjp/videos/234358334868242