spot_img
Homeజాతీయ వార్తలుTRS Vs BJP: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లొల్లి : రైతులపై ప్రేమా? ‘అధికార’ తాపత్రయమా?

TRS Vs BJP: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లొల్లి : రైతులపై ప్రేమా? ‘అధికార’ తాపత్రయమా?

TRS Vs BJP: రాష్ట్ర ప్రభుత్వం “రైతుబంధు” పేరుతో అన్నింటికీ కత్తెర వేసిందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కల్లాలు నిర్మిస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోందని భారత రాష్ట్ర సమితి నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఏకంగా పోటాపోటీగా నిరసనలు, ప్రదర్శనలు చేస్తున్నారు. కల్లాలు నిర్మించుకున్న రైతుల దగ్గర నుంచి డబ్బులు తిరిగి వసూలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించారు.. నిన్న రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయాలని బిజెపి నాయకులు రాష్ట్రంలోని అన్ని తహసిల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. సో మొత్తానికి రాష్ట్రంలో మళ్లీ బిజెపి, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం మొదలైంది.

TRS Vs BJP
TRS Vs BJP

ధాన్యం కొనుగోలు విషయంలోనూ .

నిరుడు వానాకాలం ధాన్యం కొనుగోళ్ల విషయం నుంచే బీఆర్ఎస్, బిజెపి నాయకుల మధ్య వైరం మొదలైంది.. ధాన్యం కొనడం లేదంటూ రాష్ట్రం, మేం కొనకుంటే, ఇన్నాళ్లు కొనుగోలు చేసింది ఎవరు అని కేంద్రం… ఇలా ఇరు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా రెండు పార్టీలు కూడా అవసరం వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. పైగా ప్రతి దానిలో తమ రాజకీయ లాభాన్ని చూసుకుంటున్నాయి.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు మినహా మిగతా పథకాలను అమలు చేయడం లేదు. రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు. దీంతో బ్యాంకర్లు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు.. ప్రభుత్వం రైతుబంధు డబ్బులను వేస్తే వాటిని అప్పు కింద జమ కడుతున్నారు. ఇక కేంద్రం కూడా సూక్ష్మ సేద్య పరికరాలపై జిఎస్టి విధించి రైతులను ఇబ్బంది పెడుతోంది.. ఇది ఉద్యాన పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

TRS Vs BJP
TRS Vs BJP

రైతుల బాధలు పట్టవా

రెండు పార్టీలు కూడా పంతాలకు పోవడంతో మధ్యలో రైతులు నలిగిపోతున్నారు.. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో అక్టోబర్ మొదటి వారం నుంచే వరి కోతలు షురూ అయ్యాయి. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అడ్డికి పావు శేరు చొప్పున ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్నారు. జరగాల్సిన మొత్తం జరిగిపోయిన తర్వాత ప్రభుత్వం తీరిగ్గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇక ఫసల్ బీమా యోజన పథకాన్ని వర్తింపజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.. దీనివల్ల ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు.. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తోందంటే అది కూడా లేదు.. ఇక కౌలు రైతులను ఆదుకునే ఒక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం లో రైతులను చేర్చుకోవడం లేదు. దీనివల్ల కొత్త రైతులకు లబ్ధి చేకూరడం లేదు.. పైగా కేంద్రం కూడా వివిధ వ్యవసాయ పరికరాలపై జిఎస్టి విధిస్తుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలు పెట్టుకొని రెండు పార్టీలు కూడా మీరంటే మీరు అంటూ ఆరోపణలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది .

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Telugu Heroes

Telugu Heroes: సక్సెసులు లేని హీరోలకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తుందిగా…

Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు సక్సెస్ లను సాధిస్తుండాలి. లేకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ లు...
Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Oktelugu Epaper