spot_img
Homeజాతీయ వార్తలుSupreme Court Verdict: మొగుడు మాట్లాకపోతే కేసు.. కోర్టుకా? సుప్రీంకోర్టు తీర్పు భర్తలకు ఎంతో ఊరట

Supreme Court Verdict: మొగుడు మాట్లాకపోతే కేసు.. కోర్టుకా? సుప్రీంకోర్టు తీర్పు భర్తలకు ఎంతో ఊరట

Supreme Court Verdict: సుప్రీం కోర్టు వరుసగా సంచలన తీర్పులు ఇస్తోంది. ఇటీవలే స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదని తెలిపింది. విటులను మహిళల అక్రమ రవాణాదారులుగా భావించొద్దని వెల్లడించింది. పెళ్లికి ముందు పరిచయం పెళ్లిదాకా వెళ్లవని పేర్కొంది. తాజాగా దాంపత్య జీవితంలో తలెత్తే సాధారణ వివాదాల కారణంగా భార్యాభర్తల మధ్య కొంతకాలం పలకరించుకోకపోవడాన్ని ‘క్రూరత్వం’గా భావించలేమని స్పష్టం చేసింది. 13 రోజుల అలకను ఆధారంగా భర్తను నేరస్థుడిగా నిర్ధారించడం సాధ్యం కాదని, దీనికి బలమైన ఆధారాలు అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. 498ఏ కింద వచ్చిన ఒక కేసులో భర్తకు విధించిన శిక్షను రద్దు చేసింది. భార్య ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో, భర్త విదేశంలో ఉండి ఫోన్‌లో మాట్లాడకపోవడం వల్లే ఆమె మానసికంగా బాధపడి ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వాదనను కోర్టు తిరస్కరించింది.

చట్టపరమైన ప్రాముఖ్యత..
ఐపీసీ 498ఏ మహిళలను దాంపత్య హింస, ముఖ్యంగా వరకట్న వేధింపుల నుంచి రక్షించడానికి రూపొందించబడింది. ఇది కఠినమైన చట్టం కాబట్టి, దీనిని ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు అనేకసార్లు హెచ్చరించింది. ఈ తీర్పు ద్వారా కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ‘ప్రతి దాంపత్య వివాదం, చిన్న కలతలు, లేదా తాత్కాలిక మౌనం నేరంగా మారకూడదు. కేవలం ఆధారాలు లేకుండా భర్తను శిక్షించడం వల్ల కుటుంబ వ్యవస్థలు దెబ్బతినవచ్చు, నిర్దోషులు బాధపడవచ్చు. అదే సమయంలో, నిజమైన హింస జరిగినప్పుడు బాధితులకు న్యాయం జరగాలని కోర్టు ఉద్దేశం’ అని వెల్లడించింది. ఈ తీర్పు ఆధారాల ప్రాధాన్యతను బలపరుస్తుంది.

దాంపత్య జీవితంలో వాస్తవికత
భారతీయ సంసారాల్లో చిన్నపాటి గొడవలు, అభిప్రాయ భేదాలు, కొంతకాలం మాట్లాడకుండా ఉండడం సహజమే. ఇది సంబంధాన్ని మరింత బలపరచడానికి కూడా సహాయపడుతుంది. కానీ ఇలాంటి సాధారణ విషయాలను క్రూరత్వంగా చిత్రీకరించడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, చట్టపరమైన ఇబ్బందులు పెరుగుతాయి. ఈ తీర్పు సమాజానికి ఒక సందేశం ఇస్తుంది. దాంపత్యంలో సంభాషణ ముఖ్యం, కానీ దాని లోపం మాత్రమే నేరం కాదు. ఆత్మహత్య వంటి విషాదకర సంఘటనల వెనుక ఉన్న కారణాలు సంక్లిష్టంగా ఉంటాయి.. మానసిక ఆరోగ్యం, కుటుంబ ఒత్తిళ్లు, ఇతర వ్యక్తిగత సమస్యలు కూడా ఉండవచ్చు. వీటిని కేవలం ఒక వ్యక్తి నిశ్శబ్దం కారణమని పాదించడం న్యాయం కాదు.

చట్టం దుర్వినియోగం..
ఈ తీర్పు మహిళల హక్కులను బలహీనపరచదు. నిజమైన వేధింపులు, హింస జరిగినప్పుడు చట్టం బాధితుల పక్షానే ఉంటుంది. కానీ దుర్వినియోగం నివారించడానికి ఆధారాలు తప్పనిసరి అని నొక్కి చెబుతుంది. సుప్రీంకోర్టు గతంలో కూడా 498ఏ దుర్వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తీర్పు ద్వారా ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు ఆధారాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచన చేసింది. ఇది కుటుంబ సమగ్రతను కాపాడే దిశగా ఒక ముందడుగు.

సుప్రీంకోర్టు తీర్పు చట్టాన్ని కఠినంగా అమలు చేయడంతోపాటు, మానవ సంబంధాల్లోని సూక్ష్మతలను గుర్తించాలని బోధిస్తుంది. దాంపత్య జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. చిన్న గొడవలు, నిశ్శబ్ద కాలాలు సహజం. వాటిని నేరంగా మార్చడం వల్ల న్యాయం జరగదు, కుటుంబాలు దెబ్బతింటాయి. నిజమైన హింస ఉన్న చోట చట్టం బాధితులకు రక్షణ కల్పించాలి. అదే సమయంలో, ఆధారాలు లేని వాదనలతో నిర్దోషులను శిక్షించకూడదు. కుటుంబ సమస్యలను చట్టపరమైన సమస్యలుగా మార్చకుండా, సంభాషణ, అవగాహన ద్వారా పరిష్కరించుకోవడం మంచిదని ఈ తీర్పు గుర్తు చేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper