spot_img
Homeజాతీయ వార్తలుPunjab Election Exit Poll: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా గెలవబోతోంది?

Punjab Election Exit Poll: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా గెలవబోతోంది?

Punjab Election Exit Poll: దేశంలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రానున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఆసక్తిని పెంచుతున్నాయి. అందరి దృష్టి మాత్రం పంజాబ్ పై పడింది. ఇక్కడ అతిపెద్ద పార్టీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ వెనుకంజలో పడిపోయింది. ఇక్కడ అమ్ ఆద్మీ ప్రభంజనం సృష్టించనుందని అన్ని సర్వేలు చెబుుతున్నాయి. దీంతో అందరు పంజాబ్ లో జరిగే పరిణామాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆప్ మెల్లగా తన ప్రభావాన్ని విస్తరి స్తోంది. పక్కనే ఉన్న పంజాబ్ లో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేసి పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు సిద్ధపడినట్లు తెలుతస్తోంది.

ArviKejriwal Bhagwant Mann
ArviKejriwal Bhagwant Mann

పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి. ముఖ్యమంత్రుల మార్పు కష్టాల్లో పడేసిందనే చెప్పాలి. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నవజ్యోతి సింగ్ సిద్దూ పార్టీని అధో పాతాళానికి పడేశారు. ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి పార్టీని అధికారంలోకి రాకుండా చేశారు. దీంతో ఆప్ కు ప్లస్ అయింది. ఇప్పటికే దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారం ఉన్న తాజాగా పంజాబ్ దూరమైతే ఇక రెండే మిగులుతాయి. దీంతో పార్టీ దేశంలో మనుగడ సాగించడం కష్టమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలే మిగలనున్నట్లు చెబుతున్నారు.

అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సాధారణ వ్యక్తిలాగే ఉంటూ తన ప్రభావాన్ని పంజాబ్ ఓటర్లపై చూపించారు. ఢిల్లీలో చేపట్టబోయే పథకాలను వివరిస్తూ ఇక్కడ కూడా ప్రజారంజకమైన పాలన అందిస్తామని ఓటర్లలో విశ్వాసం నెలకొల్పారు. దీంతో వారు ఆప్ కు దగ్గరయ్యారు. ఇన్నాళ్లుగా చూస్తున్న కాంగ్రెస్ పాలనకు వారు చెక్ పెట్టాలని భావించారు. అందుకే ఆప్ కే స్పష్టమైన మెజార్టీ అందించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

Punjab Election Exit Poll
Punjab Election Exit Poll

మరోవైపు భారతీయ జనతా పార్టీని కూడా ఓటర్లు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ప్రభావం పార్టీపై ప్రభావం చూపిందని తెలుస్తోంది. సాగుచట్టాలు సరైనవి కాదని లక్షలాది మంది రైతులు సంవత్సరం పాటు ఉద్యమం చేయడంతో బీజేపీని ప్రజలు విశ్వసించడం లేదు. దీంతోనే పంజాబ్ లో బీజేపీకి సీట్లు రాకుండా చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా బీజేపీ ప్రజల మనసులు గెలిచే పథకాలు తీసుకొచ్చి వారికి దగ్గర కావాలని చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాని ఎవరిని లెక్కచే యకుండా ఎవరికో ప్రయోజనం చేసేలా చట్టాలు తెస్తే ఫలితం ఇలాగే ఉంటుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఏమైనా అమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ప్రభంజనం సృష్టిస్తోందని సర్వేలన్ని వెల్లడించడం గమనార్హం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper