Homeజాతీయ వార్తలుPahalgam terror attack anniversary: పహల్గాం ఉగ్రదాడికి ఏడాది.. ఏడాదిలో పాకిస్తాన్‌ వెన్ను విరిచిన భారత్‌!

Pahalgam terror attack anniversary: పహల్గాం ఉగ్రదాడికి ఏడాది.. ఏడాదిలో పాకిస్తాన్‌ వెన్ను విరిచిన భారత్‌!

Pahalgam terror attack anniversary: పహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తయింది. 2025 ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది టూరిస్టులను మంత తెలుసుకుని హిందువులు అని తేలిన తర్వాత కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ దాడితో భారత్‌ను రెచ్చగొట్టి సవాల్‌ చేసే ప్రయత్నం చేసింది. దీనికి ప్రతిగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. గడిచిన ఏడాదిలో పాకిస్తాన్‌ దశాబ్దాలపాటు నిర్మించుకున్న వ్యవస్థలను మనం కుప్ప కూల్చాం. దాడిచేస్తే ప్రతిదాడి చేయడమే కాదు.. మొత్తం పాకిస్తాన్‌ను కూల్చే నిబంధనలు మార్చాలని భారత్‌ నిర్ణయించి ప్రక్రియ మొదలుపెట్టింది. మనం కొడితే శత్రువు మనపై దాడి చేయానికి భయపడాలి అన్నట్లుగా పాకిస్తాన్‌ వెన్నువిరిచింది భారత్‌.

25 నిమిషాల్లో ఉగ్రస్థావరాల ధ్వంసం..
మే 6, 7 తేదీల్లో మురిద్‌కే, బహావల్‌పూర్‌లో 24 ఉగ్రస్థావరాలపై రాఫెల్‌ జెట్లతో దాడి చేసి, పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను, ఎయిర్‌బేస్‌లను నాశనం చేశారు. పాక్‌ ప్రతీకార క్షేపణికలను అణిచివేసి, వారి ఫైటర్‌ జెట్‌లను కూడా కిందపడేశారు. ఈ త్వరిత చర్య ప్రపంచానికి భారత సైనిక శక్తిని చాటింది.

హోల్డ్‌లో సిందూ ఒప్పందం..
1960 ఒప్పందాన్ని రద్దు చేసి, పాక్‌ పంచవంతాల్లోకి వెళ్లే భారత నీటిని ఆపేశారు. జమ్మూ కశ్మీర్‌లో డ్యామ్‌ల నిర్మాణం మొదలుపెట్టి, డేటా షేరింగ్‌ను నిలిపారు. ఫలితంగా పాక్‌లో అసాధారణ వరదలు, కరువులు పెరిగి ఆర్థిక నష్టం రూ.50 వేల కోట్లకు చేరింది.

ఉగ్ర నాయకుల ఎన్‌కౌంటర్లు..
పహల్గాం ఉగ్రదాడి చేసిన హాస్మీ మూసా (అబూ సులేమాన్‌), హంజా అఫ్గానీ, జిబ్రా వంటి ముగ్గురు ప్రధాన ఉగ్రవాదులను శ్రీనగర్‌ సమీప అడవుల్లో మట్టుపెట్టారు. 300 రక్షిత ప్రాంతాల్లో రిక్రూటింగ్, ఆయుధ దాచిన చోట్లను గుర్తించి, మద్దతుదారులైన ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు.

దేశవ్యాప్త ఉగ్ర జాలం ధ్వంసం
సాగర జలాల్లో ఉగ్ర ఆగమనాన్ని అడ్డుకున్న ట్రైగిల్, పాక్‌ అనుకూల ఆన్‌లైన్‌ మతోన్మాద నెట్‌వర్క్‌పై వజ్ర చర్యలు చేపట్టారు. 700 మంది ప్రచారకులు, హైదరాబాద్, విజయవాడాల్లో మద్దతుదారులు, సౌదీలో పారిపోయినవారిని అరెస్టు చేశారు. వేలాది లింకులను చెదిరించారు.

జైష్‌ మహిళా విభజన, లష్కర్‌ జల మార్గ ప్రయత్నాలను అడ్డుకుని, పాక్‌ ఉగ్ర మౌలికాలకు దెబ్బతీశారు. ఇరాన్, ఉక్రెయిన్‌ యుద్ధాల్లో దీర్ఘకాల నష్టాలతో పోల్చితే, మూడు రోజుల్లో పాక్‌ను పీచమరచిన భారత వ్యూహం దేశ భద్రతా మార్గదర్శకంగా మారింది. ఇకపై ఉగ్రవాదం, చర్చలు ఏకకాలికంలో జరగదని స్పష్టం చేసింది. రక్తం, నీళ్లు కలిఇ పారవని వెల్లడించింది. ఇక ఇప్పటికీ ఆపరేషన్‌ సిందూర్‌ హోల్డ్‌లో ఉంది.

ఇరాన్‌లో అమెరికా చేసిన తప్పు.. ఉక్రెయిన్‌లో రష్యా చేసిన తప్పు చేయకుండా మూడు రోజుల్లోనే పాకిస్తాన్‌ పీచమణిచింది. యుద్ధం ఎప్పుడు చేయాలో తెలియడమే కాదు. ఎప్పుడు ఆపాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు. అది మోదీ చేశాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular