Homeజాతీయ వార్తలుDraupadi Murmu Nomination: నేడే ద్రౌపది ముర్ము నామినేషన్.. వైసీపీ మద్దతు వారికే

Draupadi Murmu Nomination: నేడే ద్రౌపది ముర్ము నామినేషన్.. వైసీపీ మద్దతు వారికే

Draupadi Murmu Nomination: రాష్ట్రపతి ఎన్నికకు కేంద్రం సిద్ధమవుతోంది. తమ అభ్యర్థిగా బీజేపీ ద్రౌపది ముర్మును ప్రకటించి ముందుకు వెళ్తోంది. ఇవాళ నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి హాజరు కానున్నారు. దీంతో ద్రౌపది ముర్ము విజయం ఖాయమనే తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు సైతం తమ అభ్యర్థిని నిలబెడతాయని ప్రచారం సాగినా ఆ ప్రయత్నాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము గద్దెనెక్కడం లాంఛనమే అని తెలుస్తోంది.

Draupadi Murmu Nomination
Draupadi Murmu

రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు బీజేపీకే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ద్రౌపది ముర్మువిజయం ఇక నల్లేరు మీద నడకే అని చెబుతున్నారు. మహారాష్ట్ర సంక్షోభంతో ప్రతిపక్షాలు ఎటు తేల్చుకోలేకపోతున్నాయి. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఎన్నిక కావడం చరిత్రగా మిగులుతుందని వైసీపీ పేర్కొంది. అందుకే ద్రౌపది ముర్ముకే తమ మద్దతు ఇస్తామని చెబుతోంది. దీంతో బీజేపీకి బలం పెరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలో తమకు అన్ని పక్షాలు మద్దతు ఇస్తాయనే ఆశ బీజేపీలో కలుగుతోంది.

Also Read: Karate Kalyani: ప్రేమ పెళ్లి పేరుతో మోసం వాడుకుని వదిలేశారు… పిల్లల్ని కనాలనే ఆశ ఇంకా ఉంది

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేయనున్నారు. ఇవాళ నామినేషన్ వేసి ఇక ప్రతి రోజు రెండు రాష్ట్రాలు తిరగాలని ప్రణాళికలు రచించారు. దీంతో ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా పర్యటించి అందరి మద్దతు కూడగట్టుకోవాలని భావిస్తున్నారు. రొటీన్ లా కాకుండా గిరిజన మహిళను ఎంపిక చేసి బీజేపీ అందరికి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము సేవలు దేశం అందుకోవాలనే ఆలోచనలో భాగంగానే ఆమెను ఎంపిక చేసి ఆశ్చర్యానికి గురి చేసింది.

Draupadi Murmu Nomination
Draupadi Murmu Nomination

ఇక బలాబలాల విషయంలో కూడా ఆమెకు తిరుగులేదని తెలుస్తోంది. ద్రౌపది ముర్ముకు అన్ని పార్టీలు మద్దతు తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే వైసీపీ తమ మద్దతు తెలపడంతో మిగతా పార్టీలు కూడా ఆమెకు ఓటు వేసేందుకు ముందుకు వస్తాయని చెబుతున్నారు. దేశానికి మొట్టమొదట గిరిజన మహిళగా రాష్ట్రపతి పీఠాన్ని అలంకరించే రెండో మహిళగా రికార్డు సృష్టిస్తారనే అందరు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ద్రౌపది ముర్ము ఎన్నికపైనే అందరికి ఆసక్తి నెలకొంది.

Also Read:Jagan Government: కీలక నిర్ణయాలు దిశగా జగన్ సర్కారు.. కేబినెట్ లో చర్చించే అంశాలివే..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper