OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / రాజకీయాలు / ఆంధ్రప్రదేశ్ / Jagan Government: కీలక నిర్ణయాలు దిశగా జగన్ సర్కారు.. కేబినెట్ లో చర్చించే అంశాలివే..

Jagan Government: కీలక నిర్ణయాలు దిశగా జగన్ సర్కారు.. కేబినెట్ లో చర్చించే అంశాలివే..

Published by Dharma Raj On Friday, 24 June 2022, 12:06

Jagan Government: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు ప్రజల బాట పట్టాయి. విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు, మినీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చే దసరా నుంచి ప్రత్యేక యాత్రకు సన్నద్ధమవుతున్నారు. దీంతో రాజకీయ హీట్ పెరుగుతోంది. చంద్రబాబు పర్యటనకు జనాలు భారీగా తరలిరావడం, బాదుడే బాదుడు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుండడం, అదే సమయంలో వైసీపీ చేపడుతున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు సరికదా ప్రజల నుంచి నిలదీతలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో అధికార పార్టీ కాస్తా కలవరపాటుకు గురవుతోంది. దీనికితోడు పవన్ కానీ ప్రజల్లోకి వస్తే ప్రజల నుంచి వ్యతిరేకత మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అందుకే దానిని అధిగమించేందుకు జగన్ ఉపశమన చర్యలు ప్రారంభించారు. కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. వీలైనంత వరకూ సంక్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు యత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా కీలకమై కోనసీమ జిల్లా వివాదాన్ని తెరదించడానికి నిర్ణయించారు. శుక్రవారం నాడు జరిగే కేబినెట్ సమావేశంలో కీలకంశాలను అజెండాగా చేర్చి చర్చించే అవకాశముంది.

Jagan Government

Y S Jagan

కోనసీమ జిల్లాపై..

ముఖ్యంగా కోనసీమ బీఆర్ అంబేద్కర్ పేరు మార్పు తరువాత జిల్లాలో విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక మంత్రి, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇళ్లనే తగులబెట్టడం ఆందోళన రేకెత్తించింది. పైకి ఇది విపక్షాలపై నెట్టే ప్రయత్నం చేసినా తరువాత జరిగిన పరిణామాలు అధికార పార్టీ ప్రభను మసకబార్చాయి. కేసులో కీలక నిందితులుగా వైసీపీ నాయకులే ఉండడంతో దీనికి వెనుక పెద్దల పాత్రపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కులపరమైన విధ్వంసాలను రేకెత్తించడంలో భాగంగా అధికార పార్టీయే ఈ దురాఘతానికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ స్థాయి అధికారి నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకూ సస్పెన్షన్ వేటు వేశారు. నిఘా వైఫల్యంగా చెప్పుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం తప్పిదంగానే ఒప్పుకున్నట్టయ్యింది. అయితే ఈ ఘటనలో అరెస్టయిన వారు మీ పార్టీ అంటే మీ పార్టీ అంటూ తొలుత దబాయించారు. చివరకు వారు మంత్రి అనుచరులేనని తేలడంతో మిన్నకుండా పోయారు. అయితే మొత్తం ఎపిసోడ్ లో మాత్రం అధికార పార్టీ వ్యూహం బూమరాంగ్ అయ్యింది. బాధిత మంత్రికి తెలియకుండా కొందరు కీలక పెద్దలు ఆడిన హైడ్రామా అని.. కావాలనే కుల విధ్వంసాలు స్రుష్టించేందుకు ప్రయత్నించారని తేటతెల్లమైంది. ఇది అధికార పార్టీకి మైనస్ కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశమిచ్చింది. కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు దాదాపు 6 వేల వినతులు వచ్చాయి. వివిధ రంగాల ప్రముఖులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ పక్షాలు తమ అభిప్రయాలను, అభ్యంతరాలను తెలియజెప్పాయి. కానీ ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందో.. లేకుంటే ప్రజాభిప్రాయానికి మద్దతు ఇస్తుందో చూడాలి మరీ.

Also Read: Gautam Adani Donation : అదానీ 60వ పుట్టిన రోజు.. రూ.60 వేల కోట్ల విరాళం

పాలనా పరమైన…

ఈ నెల 27న అమ్మ ఒడి నగదు విడుదలకు సీఎం జగన్ శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టనున్నారు. ప్రతీ విద్యార్థి తల్లి ఖాతాలో రూ.14 వేలు జమ చేయనున్నారు. దీనికి సంబంధించి నిధుల సమీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. కానీ ఈ సారి లక్ష మంది వరకూ లబ్ధిదారులు పథకానికి దూరం కానున్నారని.. గత ఏడాది కంటే మరో రూ.1,000లు తగ్గించి రూ.13 వేలు ఇవ్వనున్నారన్న ప్రచారం సాగుతోంది. దీనికి తెరదించుతూ కేబినెట్ లో చర్చించి ప్రకటన వెలువరించే అవకాశముంది. జిల్లా పరిషత్ చైర్మన్లకు సంబంధించి వారి పదవీకాలం ముగిసే వరకూ ఉమ్మడి జిల్లాలుగానే పరిగణలోకి తీసుకునేలా చట్టసవరణ చేసే అంశంపైనా చర్చించనున్నారు.భూముల ఆక్రమణల నిరోధక చట్టం, అదానీ గ్రీన్ ఎనర్జీ చేపట్టనున్న3,700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ప్రతిపాదనలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు.బైజుస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం మేరకు 8వ తరగతి విద్యార్థులకు ల్యాబ్ టాప్ లు అందించే అంశంపైనా కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. 35 పరిశ్రమలకు సంబంధించి 150 ఎకరాల కేటాయింపుపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

రాజకీయాలపై స్పష్టత…

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీఎం జగన్ కేబినెట్ లో చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో ప్రధాన పక్షాల మధ్య పొత్తులు, రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అనుసరించే వైఖరి… ఎందుకు ఎన్టీఏకు సపోర్టు చేస్తున్నామో అన్నదానిపై జగన్ మంత్రివర్గ సహచరులకు స్పష్టతనిచ్చే అవకాశముంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ అలయెన్ష్ అవుతాయని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. దీనిని అడ్డుకునేందుకు జగన్ తో పాటు కీలక నాయకులు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా జనసేన వరకూ అయితే ఒకే కానీ.. టీడీపీతో కలిసి పనిచేసేది లేదని బీజేపీ పెద్దలు అన్నట్టు టాక్ నడుస్తోంది. అదే సమయంలో ఏపీలో అధికార వైసీపీయే మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై జగన్ కొన్ని వాస్తవాలు మంత్రులకు వివరించే అవకాశముందన్న టాక్ ఉంది. అటు పాలన, ఇటు రాజకీయాంశాలకు సంబంధించి ప్రాధాన్యతాంశాలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతందన్న మాట.

Also Read: Balakrishna’s Younger Brother: బాలకృష్ణ తమ్ముడు చిరంజీవి తో కలిసి నటించిన సినిమా ఏమిటో తెలుసా?

లైఫ్ స్టైల్

Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి ఫ్లయింగ్ కిస్ వైరల్

Miss India 2022 Sini Shetty: ఫెమినా మిస్ ఇండియాగా ‘శిని శెట్టి’.. ఈ అందాల రాణి నిజంగా గ్రేట్ !

Jasprit Bumrah: ఒక టెస్టులో ఒకే ఓవర్ లో 35 పరుగులు.. బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు

Health Benefits OF Rice: అన్నం ఎలా వండుకుంటే మంచిది?

Reliance : రిలయన్స్ కొత్త సైడ్ బిజినెస్.. బిట్రీష్ వాళ్ల రుచులు ఇక ఇండియాలో..

Ind Vs Eng 5th Test: తొలి టాస్ వేళ ఆ ప్రశ్న వేసిన వ్యాఖ్యాతకు కౌంటర్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. వీడియో వైరల్

MS Dhoni Local Vaidya: ఖరీదైన కార్పొరేట్ వైద్యం వదిలేసి.. చెట్ల కింద నాటు వైద్యం తీసుకుంటున్న ధోని.. అసలేమైంది?

Alcohol: మద్యం తాగేటప్పుడు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే డేంజరే?

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Renu Desai: రేణుదేశాయ్ ను పిలిస్తే.. వచ్చి క‌మిట్‌మెంట్ గురించి చెప్పింది

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Resul Pookutty RRR: ఆర్ఆర్ఆర్.. ‘గే లవ్ స్టోరీ’.. రసూల్ పూకుట్టి కామెంట్స్ వైరల్

Koffee With Karan 7 Trailer: విడాకులపై సంచలన విషయాలు పంచుకున్న సమంత.. వైరల్

Titanic in AP: ఏపీ తీరంలో మరో టైటానిక్.. వందేళ్లుగా సముద్ర గర్భంలోనే..

Actor Ketaki Chitale: పోలీస్ కస్టడీలో తనపై లైంగిక వేధింపులు.. ఆ హీరోయిన్ సంచలన ఆరోపణ

Vishal-Chandrababu : చంద్రబాబుపై పోటీ విషయంలో స్పందించిన హీరో విశాల్.. ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్

Naresh Pavitra Lokesh: నా భార్యకు డ్రైవర్ తో ఎఫైర్.. బాంబు పేల్చిన టాలీవుడ్ నటుడు నరేష్.. షాకింగ్ నిజాలు

మరిన్ని చదవండి ...

గాసిప్

Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?

Viral: విడాకులకు సిద్ధమైన ముగ్గురు ప్రముఖ హీరోలు!?

BJP Venkaiah Naidu: వెంకయ్య కాకపోయే.. ఆ మీడియా, ఆ సామాజికవర్గం గగ్గోలు

TV9 Raviprakash: టీవీ9 అమ్మకం సక్రమమే.. రవిప్రకాష్ కు భారీ జరిమానా!

Anasuya Walks Out Of Jabardasth: సుధీర్, ఆది, ఇప్పుడు అనసూయ… బయటికి వస్తున్నారా? పంపుతున్నారా ?

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

TANA ‘Amma Nanna Sambaralu’ : ‘అమ్మానాన్న’లపై ప్రేమను చాటిన ‘తానా’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap