Homeఆంధ్రప్రదేశ్‌Mohan Babu: సినీ ఇండస్ట్రీ లూప్ హోల్స్ అన్నీ బయటపెడుతున్న మోహన్ బాబు

Mohan Babu: సినీ ఇండస్ట్రీ లూప్ హోల్స్ అన్నీ బయటపెడుతున్న మోహన్ బాబు

Mohan Babu: సినీ ఇండస్ట్రీ అంటేనే ఎవరికీ ఓపికలుండవంటారు. అందరికీ ఇగో సమస్యలు. ఆ ఇగో వల్లే నేను గొప్ప అంటే నేను గొప్ప అని సినీ ప్రముఖులు తొడలు కొట్టేస్తుంటారు. అయితే అదంతా మీడియాకు, సోషల్ మీడియాకు ఎక్కడంతో అదిప్పుడు రచ్చరచ్చ అవుతోంది. ఒకరి గోతులు మరొకరు తవ్వుకుంటున్నారు. పరువు తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

Mohan Babu
Mohan Babu

చిత్ర పరిశ్రమ మొత్తం ఒకటే కుటుంబం అంటూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని నటుడు మోహన్ బాబు విమర్శించారు. ‘సన్నాఫ్ ఇండియా’ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాలపై నోరుపారేసుకున్నారు.

Also Read:

1) మూడో కూట‌మిలో జ‌గ‌న్ చేరతారా? కేసీఆర్ తో క‌లుస్తారా?

2) చిరంజీవి, సురేఖ‌ల పెండ్లి ఫొటోను చూశారా.. చిరిగిన చొక్కాతోనే తాళి క‌ట్టిన మెగాస్టార్‌..!

 

ఏపీ సీఎం జగన్ తో భేటికి తనకు కూడా ఆహ్వానం అందిందని.. కానీ కావాలనే కొందరు తనను దూరం పెట్టారని మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో పలువురు ఆర్టిస్టులు భారీగా పారితోషికం తీసుకుంటున్నారనే వార్తలపై మాట్లాడారు. ఇతర ఆర్టిస్టులు, వాళ్లు తీసుకుంటున్న పారితోషికాలపై కామెంట్ చేయనన్నారు. నా గురించి మాత్రమే నేను మాట్లాడుతానని.. పరిశ్రమ మొత్తం ఒక కుటుంబం అంటూనే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారన్నారు.

సినీ ఇండస్ట్రీలో గోతులు వాళ్లే తీసుకుంటున్నారని.. బయట రాజకీయాల మాదిరిగానే పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి వారే గ్రేట్ అనుకుంటున్నారని.. నా దృష్టిలో ఎవరూ గొప్ప కాదని.. మనం చేసే పనులన్నింటి పైన భగవంతుడు చూస్తున్నాడని తెలిపారు.

సినిమా టికెట్ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడడానికి అందరం కలిసి వెళదామని రెండు నెలల క్రితం బహిరంగ లేఖ విడుదల చేశానని.. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. నటీనటులు, ఆర్టిస్టులు అందరికీ ఈగో ఉందని.. నిజం చెప్పాలంటే.. నేనే గొప్ప అనే అహంకారం వల్లే అందరం కలవలేకపోతున్నామని.. కానీ గతంలో అలా ఉండేది కాదన్నారు. అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు.. ఇతర నటీనటులందరం కలిసి ఒకే చోట కూర్చొని ఎన్నో విషయాలపై మాట్లాడుకునే వాళ్లమని మోహన్ బాబు అన్నారు.

సీఎంవో నుంచి తనను పిలిచారని.. నాకు ఆహ్వానం అందిందని.. నన్ను రమ్మని సినీ ప్రముఖులు పిలవలేదని.. వాళ్లు పిలిచినా.. పిలవకపోయినా నాకు విలువ ఉందని.. నా పని నేను చేసుకుంటానని అన్నారు.

నా గురించి ఏదో అనుకుంటే అది వాళ్ల కర్మ అని.. ఎదుటి వాళ్ల మాటలను పట్టించుకోనని మోహన్ బాబు అన్నారు.

Also Read:

  1.  మేడారానికి కేసీఆర్.. అమ్మవార్ల కోసం నిర్ణయం
  2.  గౌతం స‌వాంగ్ బ‌దిలీతో జ‌గ‌న్ కు చిక్కులేనా?
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

  1. […] ‘Bheemla Nayak’ Movie First Review: ‘గబ్బర్ సింగ్’ మూవీతో ఇండస్ట్రీని పవన్ కళ్యాన్ ఏ రేంజ్ లో షేక్ చేశారో అందరికీ తెలిసిందే. అందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. అందులోనే కామెడీని జనరేట్ చేసిన విధానం అభిమానులను ఉర్రూతలూగించింది. అచ్చంగా అలాంటి గెటప్ నే ‘భీమ్లా నాయక్’ మూవీలో పవన్ మరోసారి ధరించారు. అలాంటి కామెడీ టైమింగ్ నే ప్రదర్శించారట.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన సంగీత దర్శకుడు ‘థమన్’ ‘భీమ్లానాయక్’ మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. మరి థమన్ ఏం చెప్పాడు? మూవీ ఎలా ఉందనేది తెలుసుకుందాం.. […]

  2. […] Mohan Babu: మోహన్‌బాబు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో చాలా విషయాల పై మాట్లాడారు. సినిమా పరిశ్రమ మొత్తం ఒకటే కుటుంబం అంటారు కానీ, మళ్ళీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారు అంటూ మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమా ప్రెస్ మీట్ లో మోహన్ బాబు ఇంకా మాట్లాడుతూ.. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రితో భేటీకి తనకు కూడా ఆహ్వానం ఉందని.. కానీ కావాలనే కొందరు తనని దూరం పెట్టారని మోహన్‌ బాబు సీరియస్ అయ్యారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular