Homeజాతీయ వార్తలుNarendra Modi: మోదీ చెప్పిందొకటి.. విపక్షాలు చేస్తున్న ప్రచారం మరొకటి!

Narendra Modi: మోదీ చెప్పిందొకటి.. విపక్షాలు చేస్తున్న ప్రచారం మరొకటి!

Narendra Modi: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. తమిళనాడులో చావుతప్పి కన్ను చొట్టబోయిన విపక్షాలకు ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఒక అంశం దొరికింది. బంగారం ఏడాది పాటు కొనవద్దని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిపై ఇష్టానుసారంగా దీనిపై విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. మోదీ విజ్ఞప్తి.. బంగారం ఏడాది పాటు కొనవద్దని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి. ఇష్టానుసారంగా దీనిపై విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇంధనం […]

Narendra Modi: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. తమిళనాడులో చావుతప్పి కన్ను చొట్టబోయిన విపక్షాలకు ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఒక అంశం దొరికింది. బంగారం ఏడాది పాటు కొనవద్దని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిపై ఇష్టానుసారంగా దీనిపై విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.

మోదీ విజ్ఞప్తి..
బంగారం ఏడాది పాటు కొనవద్దని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి. ఇష్టానుసారంగా దీనిపై విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇంధనం పొదుపు చేయాలని, ఎరువుల వాడకం తగ్గించాలని, స్వదేశీ వస్తువులు వాడాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని, విదేశాలకు అనవసరంగా వెళ్లొద్దని సూచించారు. ఇందులో బంగారం ఒక అంశం. ఏడాదిపాటే కొనవద్దని కోరారు. విపక్షాలు మాత్రం జీవితాంతం బంగారం కొనవద్దన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. డెస్టినేషన్‌ కోసం విదేశాలకు వెళ్లే బదులు మన దేశంలోని డెస్టినేషన్‌ స్థలాలకు వెళ్లాలని తెలిపారు. స్వదేశీ వస్తువలను చాలాకాలంగా మోదీ ప్రచారం చేస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోం కోవిడ్‌ సమయంలో అమలైంది. ఇంధన పొదుపు కోసం తాజాగా ఇంధనం పొదుపు చేయాలని కోరారు. ఇప్పటికీ చాలా మంది వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవేవీ అధికారిక ఆదేశాలు కావు. అభ్యర్థన మాత్రమే.

విపక్షాల తప్పుడు ప్రచారం..
మోదీ అభ్యర్థన, కానీ విపక్షాలు చట్టం అని ప్రచారం చేస్తున్నాయి. ఆదేశాలు జారీ చేయాలంటే చాలా కసరత్తు చేయాలి. ఈ లోగా గల్ఫ్‌ యుద్ధం ఆగిపోతే సమస్య ఉండదు. రెండు నెలలు సమస్యలు రాకుండా ప్రభుత్వమే నష్టాలను భరించింది. గ్యాస్‌ మినహా ఏ ఇబ్బంది ఇప్పటి వరకు రాలేదు. కానీ భవిష్యత్‌ దృష్టా మోదీ ఈ అభ్యర్థలను చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. మన దేశంలో పెంచలేదు. యూరోపియన్‌ దేశాల్లోనూ నిబంధనలు వచ్చాయి. ఆగ్నేయాసియా దేశాలు కూడా నిబంధనలు తెచ్చాయి. భారత్‌లో నిబంధనలు లేవు. అభ్యర్థన మాత్రమే.

కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు..
బంగారంపై హడావుడి చేస్తున్న కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు చరిత్రలో ఉంది:
మొరార్జీ దేశాయి ఆర్థిక మంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో గోల్డ్‌ కొనుగోలుపై నిషేధ చట్టం చేశారు విశ్వ బ్రాహ్మణులు లైసెన్స్‌ తీసుకోవలని నిబంధనలు పెట్టారు. బార్లు, బిస్కెట్ల రూపంలో బంగారం కొనొద్దని, 14 క్యారెట్లకన్నా ఎక్కువ ఉన్న బంగారం కొనొద్దని ఆదేశించారు. దుకాణాల్లో 2 కిలోలు, విశ్వబ్రాహ్మణుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉండొద్దని ఆదేశించారు. ఇందిరాగాంధీ చట్టం చేయడంతో నష్టం జరిగింది.

మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం
మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ నిల్వలు పెంచేందుకు బంగారంపై నిషేధం విధించారు. దిగుమతి సుంకం పెంచారు. 20 శాతం బంగారం ఎగుమతి చేస్తేనే 80 శాతం దిగుమతి చేసుకోవచ్చని చట్టం చేసింది. కాంగ్రెస్‌ భయాన్ని చూపిస్తోందో అది కాంగ్రెస్‌ గతంలోనే చేసింది.

మోదీ విజ్ఞప్తి వెనుక దేశ ప్రయోజనం..
ఇప్పుడు మోదీ కూడా విదేశీ మారక నిల్వల కోసమే ఈ విజ్ఞప్తి చేశారు. కానీ ఇది అభ్యర్థన మాత్రమే. ఆదేశం కాదు. గల్ఫ్‌ యుద్ధం ఆగిపోతే సమస్య ఉండదు. రెండు నెలలు సమస్యలు రాకుండా ప్రభుత్వమే నష్టాలను భరించింది. గ్యాస్‌ మినహా ఏ ఇబ్బంది ఇప్పటి వరకు రాలేదు. కానీ భవిష్యత్‌ దృష్ట్యా మోదీ ఈ అభ్యర్థన చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. మన దేశంలో పెంచలేదు. యూరోపియన్‌ దేశాల్లోనూ నిబంధనలు వచ్చాయి. ఆగ్నేయాసియా దేశాలు కూడా నిబంధనలు తెచ్చాయి. భారత్‌లో నిబంధనలు లేవు,

విపక్షాల తప్పుడు ప్రచారం
మోదీ విజ్ఞప్తిపై విపక్షాలు చేస్తున్న హడావుడి విచిత్రంగా అనిపిస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వర్క్‌ ఫ్రం హోం కోవిడ్‌ సమయంలో అమలైంది. ఇప్పటికీ చాలా మంది వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవేవీ అధికారిక ఆదేశాలు కావు. అభ్యర్థన మాత్రమే.

డెస్టినేషన్‌ విషయం
డెస్టినేషన్‌ కోసం విదేశాలకు వెళ్లే బదులు మన దేశంలోని డెస్టినేషన్‌ స్థలాలకు వెళ్లాలని తెలిపారు. స్వదేశీ వస్తువలను చాలాకాలంగా మోదీ ప్రచారం చేస్తున్నారు. దీనిని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. మోదీ చేసింది దేశ ప్రయోజనాల కోసమే.

గతంలో బంగారం దానం..
1947కు ముందు బంగారం దానం చేయడానికి ముందుకు వచ్చారు. 1962, 1967 యుద్ధాల సమయంలో అనేకమంది తమ నగలను ఇచ్చారు. తాజాగా మహిళల్లో భయం నిర్మించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ మోదీ చేసింది అభ్యర్థన మాత్రమే. దేశంలో కష్టకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా చేశారు. ధర పెరగడంతో ఇప్పటికే కొనుగోళ్లు బాగా తగ్గాయి. అయితే పరిస్థితుల దృష్ట్యా మోదీ విజ్ఞప్తి చేశారని గుర్తుంచుకోవాలి.

మోదీ విజ్ఞప్తి దేశ ప్రయోజనాల కోసం, కాంగ్రెస్‌ ప్రచారంరాజకీయ లాభం కోసం. ప్రజలు ఈ తేడాను గుర్తించాలి. మోదీ అభ్యర్థన మాత్రమే చేశారు, ఆదేశాలు జారీ చేయలేదు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper