spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TTD New Chairman: టీటీడీకి కొత్త చైర్మన్.. బాబాయికి జగన్ షాకిస్తాడా?

TTD New Chairman: టీటీడీకి కొత్త చైర్మన్.. బాబాయికి జగన్ షాకిస్తాడా?

TTD New Chairman: తిమింగళాలు ఆకలిని తీర్చుకునేందుకు తనకు ఎదురొచ్చిన చేపలను మింగేస్తుంటాయి. అటవిక రాజ్యంలో సింహం తన తోటి జంతువులను వేటాడి తినేస్తుంది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కూడా సేమ్ సీన్. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని పదిలపరుచుకోవడానికి ఎంతటి పనినైనా చేసేందుకు జగన్ సిద్ధపడుతున్నారు. ప్రజలను నయానో..భయానో తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వలంటీర్లతో 50 కుటుంబాలను తన గుప్పెట్లో పెట్టుకుంటుండగా.. ఇప్పుడు వారిపై గృహసారథులను నియమిస్తున్నారు. గత ఎన్నికల్లో పనికొచ్చారని.. వచ్చే ఎన్నికల్లో పనికొస్తారని సలహాదారులతో పాటు నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలను ఆలస్యం చేసి.. వీరికి మాత్రం ఠంచనుగా ఒకటో తేదీన జీతాలు, ఇతర అలవెన్స్ లు బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఎన్నికలకు సమీపిస్తున్న కొలదీ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు కీలక పదవులు అస్మదీయులకు కట్టబెట్టిన జగన్.. ఇప్పుడు ఉన్న ఈ కొద్ది నెలలు బడుగు బలహీనవర్గాలకు ఇచ్చేందుకు నిర్ణయించారు.

TTD New Chairman
janga krishnamurthy

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. పాపం సినీ నటుడు మోహన్ బాబు ఈ పదవిపై మోజు పెంచుకొని గత ఎన్నికల ముందు నానా యాగి చేశారు. పదవి కోసం ఎంతగానో పరితపించారు. తన మనసులో ఉన్న మాటను కూడా చాలా సందర్భాల్లో బయటపెట్టారు. కానీ వాటికి జగన్ మనసు కరగలేదు. తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికే పదవి కేటాయించారు. చాలా సార్లు ఆయనకు రెన్యూవల్ చేస్తూ వచ్చారు. అయితే ఈసారి కొద్దినెలల పాటు తప్పించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వరకూ బీసీలకు అప్పగించి.. అధికారంలోకి వస్తే మళ్లీ బాబాయ్ కే పీఠం అందించేందుకు తాజాగా నిర్ణయించారు.

TTD New Chairman
janga krishnamurthy

బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తికి టీటీడీ అధ్యక్ష పీఠం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలు కీలకంగా మారడంతో వైవీ సేవలను పార్టీకే వినియోగించుకోవాలని జగన్ పిక్స్ అయినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఆగస్టుతో వైవీ పదవీ కాలం ముగుస్తుంది. అదే నెల వైకుంఠద్వార దర్శనం అనంతరం వైవీ పదవి నుంచి నిష్క్రిమిస్తారని టాక్ ఉంది. అటు జంగా కృష్ణమూర్తి వైసీపీలో సీనియర్ నాయకుడు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తున్నారు. గురజాల రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పదవి చేపట్టారు. ఈ నేపథ్యంలో జంగాను టీటీడీ పీఠంపై కూర్చోబెట్టాని జగన్ డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇదే పంథాను అనుసరించారు. ఎన్నికలకు ముందు పుట్టా సుధాకర్ యాదవ్ కి టీటీడీ బాధ్యతలు కట్టబెట్టారు. బీసీ నినాదాన్ని తెచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈసారి జగన్ అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Oktelugu Epaper