Homeఆంధ్రప్రదేశ్‌Attack On Ministers At Visakha Airport: విశాఖ ఎయిర్ పోర్ట్ లో మంత్రుల‌పై దాడి...

Attack On Ministers At Visakha Airport: విశాఖ ఎయిర్ పోర్ట్ లో మంత్రుల‌పై దాడి – వైసీపీ కోడిక‌త్తి హ‌డావిడి – రెంటికి లింక్ ఉందా..?

Attack On Ministers At Visakha Airport: విశాఖ విమానాశ్రయంలో మొన్న జరిగిన ఎపిసోడ్ అంతా ప్లాన్ ప్రకారం జరిగిందా? గతంలో జరిగిన కోడి కత్తి తరహాలో చేయాలనుకున్నారా? వ్యూహాత్మకంగా పవన్ వచ్చే సమయానికి మంత్రులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారా? భారీ పోలీస్ బందోబస్తు మధ్య వస్తున్న మంత్రులు, వైసీపీ కీలక నాయకులపై దాడి సాధ్యమేనా? ..ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇవే చర్చనీయాంశమవుతున్నాయి. జనసేనను టార్గెట్ చేయడం వెనుక ప్రభుత్వం కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటి కోడి కత్తి డ్రామాను గుర్తుకు తెస్తున్నాయి. ఇవన్నీ ప్రీ ప్లాన్ గా చేసినట్టు ఉందని అటు విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా జనసేనను బోనులో నిలిపేందుకేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతికూలతలు ఎదురైన ప్రతిసారి వైసీపీ అనుసరించే పంథా ఇదేనని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

Attack On Ministers At Visakha Airport
Attack On Ministers At Visakha Airport

నాడు విపక్ష నేతగా జగన్ సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసేవారు. సీబీఐ కేసులుండడంతో ప్రతీ శుక్రవారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి విమానమార్గంలో హైదరాబాద్ వెళ్లేవారు. ఈ క్రమంలో విజయనగరంలో పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళ్లేందుకు జగన్ విశాఖ ఎయిర్ పోర్టకు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ యువకుడు కోడి కత్తితో దాడిచేశాడు. అప్పట్లో వైసీపీ సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. నేరుగా చంద్రబాబే కత్తి ఇచ్చి పంపించారన్న రేంజ్ లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో భారీగా రాజకీయ లబ్ధి పొందారు. అధికారంలోకి వచ్చాక కోడి కత్తి కేసు ఏమైందో? నిందితుడు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. కేసులో విచారణ పూర్తిచేసి కుమారుడ్ని రిమాండ్ నుంచి తప్పించాలని నిందితుడి తల్లి ఎన్నిసార్లు ప్రభుత్వానికి లేఖరాసినా స్పందన లేదు. రావాల్సిన మైలేజీ వచ్చింది.. ఇక కేసుతో పని ఏమీ లేదనుకున్న వైసీపీ ప్రభుత్వానికి అదో అప్రాధాన్యత అంశంగా మారిపోవడంతో పట్టించుకోవడం మానేశారు.

అయితే ఇప్పుడు అదే ఎయిర్ పోర్టులో మరింత రక్తికంటించే సన్నివేశాలకు ఆజ్యం పోశారు. జనవాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ ఎయిర్ పోర్టుకు వస్తున్నారు. అప్పటికే వేలాది మంది జనసైనికులు అక్కడకు చేరుకున్నారు. అసలే రాష్ట్ర విభజన భావోద్వేగాల సమయమది. రెండు పార్టీలు వేర్వేరు స్టాండ్స్ తీసుకున్నాయి. ఆ సమయంలో ఎయిర్ పోర్టుకు వెళ్లడం తగునా? వెళ్ళినా పోలీసులు ఏమయ్యారు? బందోబస్తు ఎందుకు పెంచలేదు? రెండు పార్టీల శ్రేణులు ఎదురెదురుగా తారసపడితే కవ్వింపు సంకేతాలు రావన్న ధీమా ఎందుకు? ఈ ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ వైపు అనుమానపు చూపులు చూడడం ప్రారంభించాయి. నాటి కోడి కత్తి డ్రామా ఎపిసోడ్ ను గుర్తుచేస్తున్నాయి. నాటి ఘటన సత్ఫలితమివ్వడంతోనే ఇప్పుడు జనసేనను కార్నర్ చేసుకొని ప్లాన్ బీ అమలు చేసినట్టు జనసైనికులు అనుమానిస్తున్నారు.

Attack On Ministers At Visakha Airport
Attack On Ministers At Visakha Airport

పవన్ విశాఖ పర్యటనకు రావొద్దని ముందస్తు హెచ్చిరికలతో ఇటువంటి వాటికి ప్లాన్ చేసి ఉంటారన్న అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. అటు విశాఖ గర్జన కూడా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. దాదాపు 50కుపైగా ఉన్న నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేశారు. కానీ పది వేల మంది మించి జనాలకు పోగుచేయలేకపోయారు. మరోవైపు జనసేన కార్యక్రమాలకు స్వచ్ఛందంగా జనాలు రావడం చూసి తట్టుకోలేకపోయారు. అందుకే కోడి కత్తి తరహాలో విశాఖ ఎయిర్ పోర్టు డ్రామాను తెరపైకి తెచ్చారు. మొత్తానికి కోడి కత్తి సీన్ ను యాజ్ టీజ్ గా దించేశారు. జన సైనికులను భయపెట్టాలని చూశారు. కానీ అవేవీ సక్సెస్ అయిన పరిస్థితుల్లో లేవు. తిరిగి ఇప్పుడు వైసీపీ మెడకే చుట్టుకుంటున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper