Homeజాతీయ వార్తలుTelangana: తెలంగాణ ప్రజలకు కరెంటుషాక్.. యూనిట్ కు రూ.1 పెంపు

Telangana: తెలంగాణ ప్రజలకు కరెంటుషాక్.. యూనిట్ కు రూ.1 పెంపు

Telangana: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై భారీగానే ధరలభారం మోపేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పుడిప్పుడే.. కరోనా నుంచి కోలుకుంటున్న ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతలో కొంత బయటపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు సైతం తన ఆర్థిక పరిస్థితులను గట్టెక్కించుకునేందుకు ప్రజలపై భారం మోపేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్,నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటగా.. నేడో రేపో ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచేందుకు ప్రతిపాదనలు సైతం సిద్ధం అయ్యాయి. ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపితే.. బస్సు ప్రయాణం పేదల ప్రజలకు భారంగా మారనుంది. ఇదే క్రమంలో విద్యుత్ బిల్లులు కూడా పెంచాలని సర్కారు ఆలోచన చేస్తోంది. విద్యుత్ ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని.. గత ఐదేళ్లుగా విద్యుత్ చార్జీలు ఒక్కపైసా కూడా పెంచకపోవడంతో నష్టాలతో పాటు.. ఆర్థిక లోటు పెరిగిపోయిందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ సర్కారుకు నివేదిక అందించింది.

Telangana
Telangana

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూనిట్ కు కొంతలోకొంత రూపాయి అయినా పెంచితే తప్పా ఆర్థిక కష్టాలు తీరవని డిస్కంలు భావిస్తున్నాయి. దీంతో ఈ సారి కరెంటు చార్జీల పెంపు భారీగానే ఉండనుంది. గతంలో మారిదిగా ప్రజలపై పడే భారం ఏర్పడకుండా.. యూనిట్ కు 5నుంచి 10 పైసల చొప్పున పెంచితే.. సంస్థకు ఎలాంటి ప్రయోజనం ఉండదని.. పైగా చార్జీలు పెంచిన పేరే తప్పా.. ఆర్థికంగా జరిగే నష్టాలను ఏ మాత్రం పూడ్చే అవకాశం ఉండదని విద్యుత్ సంస్థ భావించింది. ప్రస్తుత ఏడాదితో పాటు వచ్చే ఏడాది కలిపి రూ.21,552 వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని.. వీటితో పాటు ఏడాదికి రూ.6వేల కోట్ల నష్టం చవిచూడాల్సి వస్తోందని వివరించింది. రాష్ట్రంలో ఏటా నాలుగువేల కోట్ల యూనిట్ల విద్యుత్ ను ప్రజలకు విక్రయిస్తుండగా.. యూనిట్ కు సగటున రూపాయి చొప్పున పెంచితే రూ.4వేల కోట్ల ఆదాయం ఏటా పెరుగుతుంది. ప్రస్తుత చార్జీలు కొనసాగిస్తే.. 10వేల కోట్ల లోటు ఉంటంది.యూనిట్ కు రూపాయి చొప్పున పెంచినా. మరో రూ.6వేల కోట్ల లోటు ఉంటుంది.

Also Read: ప్రయాణికులకు షాక్: ఆర్టీసీ చార్జీలు మోత మోగిపోయాయి.. ఎంత పెంచారంటే?

ఈ క్రమంలో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని సంస్థ చెబుతోంది. యూనిట్ కు రూ.1 చొప్పున పెంచితేనే.. మరో రూ.6కోట్ల భారం పడుతోందని.. ఈ క్రమంలో పెంపు అనివార్యంగా మారిందని సంస్థ చెప్పుకొస్తోంది. ఇందుకు సంబంధించిన నివేదిక అందించాలని ఈఆర్సీ కోరింది. వారం రోజుల్లో విద్యుత్ బిల్లుల ప్రతిపాదన నివేదిక తయారు కానుంది. 120 రోజుల తరువాత బిల్లుల పెంపు ప్రతిపాదన అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే పెరిగిన నిత్యవసరాలు.. ఇతర ఖర్చులు.. ఇంధన ధరలతో పాటు .. మరోసారి కరోనా భయం పొంచి ఉన్న క్రమంలో సర్కారు చార్జీల పెంపు నిర్ణయంపై పునర్ ఆలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్థికంగా చితికిపోయి ఉన్న తమ జీవితాలపై చార్జీల గుదిబండ ను మోపడం సరికాదని చెబుతున్నారు. ఈ విషయమై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read: ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ టెన్షన్.. స్వయంగా రంగంలోకి దిగిన DGP మహేందర్ రెడ్డి

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular