Comedian Vadivelu: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతాలకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కరోనా మహమ్మారి వలన సినీ నటులు చాలామంది కన్నుమూశారు . అలానే మరికొంత మంది కరోనా నుండి బయట పడ్డారు. తాజాగా తమిళ సీనియర్ హాస్య నటుడు వడివేలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఒక సినిమా నిమిత్తం లండన్ లో షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్నారు వడివేలు. ఆ షూటింగ్ షెడ్యూల్ ముగించుకొని మూడు రోజుల ముందు ఇండియాకు వచ్చారు వడివేలు.
అయితే ఇటీవలే లండన్ నుంచి వచ్చిన వడివేలు ఆరోగ్యపరంగా కాస్త అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆయనను హాస్పటల్లో జాయిన్ చేయగా ఇవాళ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో కమెడియన్ వడివేలు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ అయినా ఒమిక్రాన్ పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు రేపు ఆ రిపోర్టులు రానున్నవి. అయితే ఇటీవలే హీరో విక్రమ్, కమల్ హాసన్, అర్జున్, సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా బారి నుండి కోలుకొని మళ్ళీ షూటింగ్ లో అడుగుపెట్టారు కమల్ హాసన్.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More