కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో బాలీవుడ్ నుంచి చాలా మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించడం జరిగింది. అక్షయ్ కుమార్ వంటి హీరో అయితే ఏకంగా పాతిక కోట్లు విరాళం ప్రధానికి అందించి
తన లోని దేశభక్తిని , సేవాగుణాన్ని గొప్పగా చాటుకున్నాడు ఆ సంఘటన బాలీవుడ్ లోఎందరికో ఆదర్శమయ్యింది. ఆ క్రమంలో కొందరు పేద కుటుంబాలను దత్తత తీసుకోవడం.. ఇంకొందరు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చేస్తున్నారు.
అలాంటి తరుణంలో ప్రముఖ నటుడు సోనూసూద్ హెల్త్ వర్కర్స్ కోసం ఓ మంచి పనిచేసి నేను సినిమాల్లో మాత్రమే విలన్ ని , రియల్ లైఫ్ లో హీరో ని అని నిరూపించుకున్నాడు. అంతే కాదు నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు ఇలా అందరిచేత శభాష్ సోనూసూద్ అనిపించు కొన్నాడు . ఇంతకీ సోనూసూద్ ఏం చేసాడో తెలుసా ? కరోనాపై పోరాడుతున్న హెల్త్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా ముంబైలోని జుహు ప్రాంతంలో ఏకంగా ఓ హోటల్ ని ఓపెన్ చేసేసాడు. ఇందులో విశేషం ఏమిటంటే హెల్త్ వర్కర్స్ వచ్చి ఉచితంగా భోజనాలు చేసి వెళ్లొచ్చు.. ఒక్క పైసా కూడా బిల్ కట్టక్కర్లేదు సోనూసూద్ చేసిన ఈ మంచి పనికి మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపిస్తోంది .
రోజు రోజుకి అమీబా లా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా, హెల్త్ వర్కర్స్ నిరంతరాయంగా పనిచేస్తున్న తీరు చూసి తాను కూడా ఏదో ఒక మంచి పనిచేయాలని భావించిన సోనూసూద్ ఇలా ఉచిత హోటల్ ప్రారంభించి సేవ చేస్తున్నాడట ….
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sonu sood offers his hotel for healthcare workers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com