సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మణిశర్మ – చిరు కలయికలో చాల కాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా స్థాయిని పెంచింది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘లాహే లాహే’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఈ సాంగ్ మధ్యలో వచ్చిన చిరు స్టెప్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా వింటేజ్ చిరు కనబడ్డారనే కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ కూడా విపరీతంగా వచ్చాయి. అందుకే ఈ సాంగ్ పై 50 మిలియన్ల వ్యూస్ కురిశాయి. మెగాస్టార్ కెరీర్ లో 50 మిలియన్ల వ్యూస్ రావడం ఇదే మొదటిసారి. మొత్తానికి పాట సినిమా విడుదలకు ముందే పెద్ద హిట్టైంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటం, పైగా చరణ్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవడంతో ఆచార్యకి బాగా మార్కెట్ అయ్యేలా ఉంది.
ఇప్పటికే ఈ సినిమాకి వస్తున్న బజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓ అంచనా వేస్తే దాదాపు ఈ సినిమా మార్కెట్ మొత్తం 200 కోట్లు దాటేస్తోందని అంటున్నారు. నైజాంలో వరంగల్ శ్రీనుకు 45 నుంచి 49 కోట్ల మధ్యలో కోట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రలో 60 కోట్ల రేషియోలో అమ్మారట. ఇక మిగిలిన ఏరియాల్లో కూడా కలుపుకుని మొత్తమ్మీద ఆచార్య థియేటర్ హక్కులు 150 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందట.
అన్నట్టు ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో తిరిగి స్టార్ట్ చేయాలని.. కాకపోతే మెగాస్టార్ లేకుండానే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే జులై సెకెండ్ వీక్ నుండి మెగాస్టార్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Record views in megastar career
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com