Pokiri Mahesh Babu Ileana Incident: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్లడానికి గల కారణం ఏంటి అంటే మన హీరోలు దర్శకులు కొత్త కథలతో ప్రేక్షకులను ఆదరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సినిమాను చూసే విధానాన్ని కూడా మార్చేస్తున్నారు. బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేశాడు… ఇక మన స్టార్ హీరోల్లో మహేష్ బాబు సైతం ప్రస్తుతం రాజమౌళితో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరియర్ లోనే మొదటి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన పోకిరి సినిమా సమయంలో ఆయన హీరోయిన్ ఇలియానా కి సారీ చెప్పాడు. ఎందుకని మహేష్ బాబు ఇలియానా కి సారి చెప్పాడు అంటూ అప్పట్లో కొన్ని వార్తలైతే మీడియాలో హల్ చల్ చేశాయి.
నిజానికి మహేష్ బాబు ఏం తప్పు చేశాడు ఎందుకని ఇలియానా కి సారీ చెప్పాడు అంటూ చాలా కథనాలైతే వచ్చాయి. మరి దానికి గల కారణం ఏంటి అంటే పోకిరి సినిమా షూటింగ్ పబ్లిక్ లో జరుగుతున్నప్పుడు మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు ను చూడటానికి తన మీదకి ఎగబడ్డారట. ఇక అతనితో పాటుగా అక్కడే ఉన్న ఇలియానా సైతం ఆ క్రౌడ్ లో ఇరుక్కుపోయిందట.
తన ఫ్యాన్స్ వల్లే ఇలియానా అలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని మహేష్ బాబు తనకు సారీ చెప్పాడట. ఇక మొత్తానికైతే మహేష్ బాబు సంస్కారాన్ని తెలుసుకుని చాలామంది అతని గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. ఇక ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మహేష్ బాబు తన ఫ్యాన్స్ తరఫున ఎలాంటి రెస్పాన్సిబిలిటి తీసుకుంటాడో మనం అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికైతే పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేసి మహేష్ బాబు కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు పూర్తి కమర్షియల్ హంగులతో ఉన్నప్పటికి ఇప్పుడు వారణాసి సినిమాతో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
