Peddi Movie: తెలంగాణ లో మళ్లీ థియేటర్స్ యాజమాన్యాలు , ఎక్సిభిటర్స్ యుద్ధం మొదలు పెట్టారు. నేడు ఏర్పాటు చేసిన సమావేశం లో మాకు ఎట్టి పరిస్థితిలోనూ కమీషన్ బేసిస్ మీదనే సినిమాలను రన్ చెయ్యాలి అనే ప్రతిపాదన పెట్టారు. ఈ అంశం పై గత కొన్ని రోజుల నుండి చర్చలు నడుస్తూనే ఉన్నాయి, అవి విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ విధానం పై దిల్ రాజు వర్గం సుముఖం గానే ఉంది , ఎందుకంటే తెలంగాణ లో అత్యధిక శాతం థియేటర్స్ ఉన్నవి వీళ్ళకే కాబట్టి , కానీ అందుకు ఇతర నిర్మాతలు అసలు ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. ఈ కారణం చేత , రీసెంట్ గా ఈ సంస్థ నుండి విడుదలైన ‘జెట్ లీ’ చిత్రానికి దిల్ రాజు మరియు ఏషియన్ ప్రాపర్టీస్ లో విడుదల ని బ్యాన్ చేశారు.
ఈ నెలలో మరోసారి సమావేశం ఉంటుందట , ఆ సమావేశం సఫలం అవ్వకుంటే , ఈ నెల 29 నుండి థియేటర్స్ ని బంద్ చెయ్యాలని అనుకుంటున్నారట ఎక్సిభిటర్స్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అయితే వచ్చే నెల 4 న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమాకు నైజాం ప్రాంతం లో 60 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంత బిజినెస్ జరిగిన ఈ చిత్రాన్ని నాశనం చేసేందుకు దిల్ రాజు గ్యాంగ్ పెద్ద రూట్ మ్యాప్ వేసిందని సోషల్ మీడియా లో సాగుతున్న చర్చ. కాసేపటి క్రితమే దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడుతూ ‘ఇకపై మీరు ప్రభుత్వం నుండి జీవోలు తెచ్చుకున్నా సరే , మా సింగిల్ స్క్రీన్స్ లో మామూలు టికెట్ రేట్స్ మాత్రమే ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
అంటే ‘పెద్ది’ చిత్రానికి అత్యధిక టికెట్ రేట్స్ మా థియేటర్స్ లో అనుమతించము అని చెప్పకనే చెప్పారు. అభిమానులను భయపెడుతున్న మరో అంశం ఏమిటంటే , ఈ సినిమాని ‘జెట్ లీ’ లాగానే దిల్ రాజు , ఏషియన్ గ్రూప్స్ కి సంబంధించిన థియేటర్స్, బ్యానర్స్ లో బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఇలా జరగడం చాలా అన్యాయం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒక నిర్మాత అయ్యుండి , కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిన ఒక పెద్ద సినిమాని డ్యామేజ్ చేయాలనీ చూడడం అత్యంత నీచమైన చర్య అని, దిల్ రాజు ఇలాంటి పాలిటిక్స్ ఆపకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.