Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో దూసుకుపోతూ… తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ షోను… సన్ నెట్ వర్క్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో మన ముందుకు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే జెమినీ టీవీలో తమన్నా హోస్ట్గా మాస్టర్ చెఫ్ కార్యక్రమం ప్రారంభమైంది. కాగా సినిమా షూటింగ్ కారణంగా ఆమె షెడ్యూలు కు అందలేదని సమాచారం. దీంతో తమన్నా స్థానంలో… అనసూయను యాంకర్ గా పెట్టడం తెలిసిందే. దీనిపై తమన్నా అసంతృప్తి చెంది… మాస్టర్ చెఫ్ తెలుగుపై ప్రోగ్రాం నిర్వహకులకు నోటీసులు పంపించారు. అయితే ఇప్పుడు మాస్టర్ చెఫ్ నిర్వాహకులు హీరోయిన్ తమన్నాకు షాకిచ్చారు.
ఈ విషయంపై స్పందించిన మాస్టర్ చెఫ్ తెలుగు కార్యక్రమం నిర్వాకులు తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తమన్నాను హోస్ట్గా ఎంచుకున్నప్పుడు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు… మొత్తం 18 రోజులు షోకు హోస్ట్గా వ్యవహరించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు వివరించారు. కానీ తమన్నా బిజీ షెడ్యూల్ కారణంగా 18 రోజుల్లో 16 రోజులు మాత్రమే షూటింగ్కు హాజరయ్యారని వెల్లడించారు.
మిగిలిన రెండు రోజులు ఆమె షూటింగ్కు హాజరవకపోవడంతో… దాదాపు ప్రొడక్షన్ హౌజ్కు రూ. 5 కోట్లకు పైగానే నష్టం వచ్చిందని నిర్వాహకులు అన్నారు. తమన్నకు ఇప్పటి వరకు అప్పటికే రూ. కోటి 56 లక్షలు పేమెంట్స్ ఇచ్చేశామని… అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం మిగిలిన రెండు రోజులు షూటింగ్ పూర్తి చేసి ఉంటే బ్యాలెన్స్ రూ. 50 లక్షల పేమెంట్ కూడా ఇచ్చే వాళ్ళమని తెలియజేశారు. కానీ ఆ రెండు రోజుల షూటింగ్ పూర్తి చేయకుండానే… సెకండ్ సీజన్కు అడ్వాన్స్ కావాలని తమన్నా డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. తాము అసలు సెకండ్ సీజన్కు హోస్ట్గా తమన్నాను అనుకోలేదని షో నిర్వాహకులు పేర్కొన్నారు. అలానే దీనికి సంబంధించి ఎలాంటి వార్తలు రాయాలనుకున్నా వారిని సంప్రదించాలని మాస్టర్ చెఫ్ కార్యక్రమ నిర్వాహకులు కోరారు. మరి ఈ ప్రెస్ నోట్ పై తమన్నా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.