SreeDevi Drama Company: ఈ టీవీ షో లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోతూ మంచి ఎంటర్టైన్మెంట్ షో గా మారింది. ఇందులో బుల్లితెర పై ఒక వెలుగొందుతున్న స్టార్ సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి సినీ నటి ఇంద్రజ జడ్జి గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రతి వారం వారం బుల్లితెర,వెండి తెర సెలెబ్రిటీలను పిలిచి సందడి చేస్తున్నారు. అంతే కాకుండా రేటింగ్ పరంగా కూడా ఓ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్కటి అని తేడా లేకుండా నవరసాలకి సంబంధించిన పెర్ఫార్మన్స్ లన్ని దీనిలో ఉంటాయి. డాన్స్, కామెడీ, సింగింగ్ అలా పలు రకాలైన ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ లు కూడా ఉంటాయి. బుల్లి తెరలో ఎన్ని షోలు ఉన్నా.. ప్రేక్షకులు వినోదమైన కార్యక్రమాలకే మొగ్గు చూపుతారు.
అలా ప్రేక్షకుల పల్స్ ని క్యాచ్ చేసుకుని బోలెడు ఎంటర్టైన్మెంట్ షోలు, రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. ఇంకా చెప్పాల్సిన పని లేదు.. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాబట్టే టీవీ చానల్స్ అన్ని ఎంటర్టైన్మెంట్ షో లతో కాలం వెలిబుచ్చుతున్నాయి. అంతే కాకుండా బుల్లితెరకి ఎంటర్టైన్మెంట్ షోల తోనే ఎక్కువ రేటింగ్ వస్తుంది.
ఈ నేపథ్యం లో విడుదల అయిన శ్రీదేవి డ్రామా కంపెని ప్రోమో ఒక వైపు నవ్విస్తూనే మరో వైపు కంటతడి పెట్టించింది. దివ్యాంగుల డాన్స్ అలరించగా మరోవైపు అనాధ పిల్లల దీన కథలు కన్నీరు పెట్టించాయి. కన్నీరు రాని బండరాయి కి కూడా కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. అయితే ఈ షో కి బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, హారిక మంచి పెర్ఫార్మన్స్ ల తో అదరగొట్టారు. మరి పూర్తి ఎపిసోడ్ కోసం ఈ వచ్చే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.