spot_img
Homeఎంటర్టైన్మెంట్Kalisundam Raa: దేశంలోనే అత్యధికంగా సినిమా టిక్కెట్లు అమ్ముడుపోయిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

Kalisundam Raa: దేశంలోనే అత్యధికంగా సినిమా టిక్కెట్లు అమ్ముడుపోయిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

Kalisundam Raa: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అయింది. అత్యున్నత ఆస్కార్ బరిలోనూ మన సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే.. ఇండస్ట్రీకి రికార్డులు కొత్తేమి కాదని తెలుస్తోంది. గత కాలంలోనే కొన్ని తెలుగు సినిమాలు సంచలనాలు సృష్టించాయి. ఆ కాలంలోనే తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు ఎక్కువ లాభాలు తెచ్చాయి. వాటిలో ఓ సినిమాకు దేశంలోనే అత్యధికంగా టిక్కెట్లు అమ్ముడుపోయిన రికార్డు ఉంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ మెగాస్టార్ మూవీని తట్టుకొని మరీ అత్యధిక సెంటర్లలో ఎక్కువ రోజులు నడిచింది. ఇంతకీ ఆ సినిమా గురించి వివరాల్లోకి వెళితే..

2000 సంవత్సరంలో తెలుగు సినిమాలు పోటీ పడి థియేటర్ లోకి వచ్చాయి. ఈ సమయంలో ఆడియన్స్ కు మంచి వినోదం అంటే సినిమా చూడడమే. అందుకే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వాటిలో ‘కలిసుందాం రా’ ఒకటి. విక్టరి వెంకటేష్ నటించిన ఈ మూవీ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా అలరిస్తుంది. ఆ సమయంలో వెంకీ వరుసగా ఫ్యామిలీ చిత్రాల్లో నటించడంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో వచ్చిన ‘కలిసుందాం రా’ కూడా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది.

ఉదయ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘కలిసుందాం..రా’ సినిమాలో వెంకటేశ్ కు జోడిగా సిమ్రన్ నటించారు. అంతకుముందు ఈ మూవీ కోసం అంజలా జవేరి ని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సిమ్రన్ కు అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని సిమ్రన్ ఉపయోగించుకున్నారు. ఈ సినిమాలో శ్రీహరి, రంగనాథ్, విశ్వనాథ్ శర్మ, రాళ్లపల్లి,బ్రహ్మానందం లాంటి లెజెండ్స్ నటించారు. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని కలగలిపి ఉన్న ఈ సినిమా ముందుగా 78 కేంద్రాల్లో మాత్రమే రిలీజ్ అయింది. అందుకు కారణం ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ‘అన్నయ్య’ థియేటర్ లోకి రావడమే.

మొదట్లో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయినా ఆ తరువాత సినిమా గురించి తెలిశాక థియేటర్ల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా చాలా థియేటర్లలో 50 రోజులు నడిచింది. ఇలా 14 సెంటర్లలో 175 రోజులు 4 థియేటర్లలో 200 రోజులు నడిచి రికార్డుల్లోకెక్కింది.ఇలా 200 రోజుల పాటు నడిచిన ఈ సినిమాకు మొత్తంగా 2 కోట్ల 50 వేల టిక్కెట్లు అమ్ముడు పోయాయి. ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బీట్ చేయలేదంటే మాటలు కాదు. సింపుల్ గా థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన ఏకైక సినిమాగా ‘కలిసుందాం..రా’ నిలుస్తుంది. ఇక ఈ సినిమాను రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ.25 కోట్లు గ్రాస్ చేసింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
NEET Paper Leak

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Tech Mahindra Employee

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Oktelugu Epaper