spot_img
Homeఎంటర్టైన్మెంట్Nirmalamma: ఎందరికో అన్నం పెట్టిన నిర్మలమ్మ.. చివరికి ఎలా మరణించిందో తెలుసా?

Nirmalamma: ఎందరికో అన్నం పెట్టిన నిర్మలమ్మ.. చివరికి ఎలా మరణించిందో తెలుసా?

Nirmalamma: అమ్మగా అలనా పాలనా చూసేవారు.. అత్తగా ఆదరించేవారు.. బామ్మగా బంధాలను కలిపేవారు నిజజీవితంలో చాలా మందికి కరువవుతారు. కానీ ఈ పాత్రల్లో నటించి అమ్మ, అత్త, బామ్మలు ఎలా ఉంటారో చూపించి.. అందరికీ అమ్మగా మారి పేరు తెచ్చుకున్న నటి నిర్మలమ్మ. అలనాటి హీరోయిన్ సావిత్రి తరువాత రియల్ నటిగా పేరు తెచ్చుకున్నారు నిర్మలమ్మ అని కొందరు కొనియాడుతారు. దాదాపు రెండు తరాల ప్రేక్షకులను అలరించి, అందరికీ దగ్గరైన నిర్మలమ్మ సినిమాల్లో ఎంతో చక్కగా నటించింది. సినిమాల్లోనే కాకుండా రియల్ జీవితంలో ఎంతో మనసున్న మా తల్లి అని పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే తన ఇంటికి ఆకలితో ఎవరూ వచ్చినా కాదనకుండా కడుపు నింపేది. అలాంటి ‘అన్నపూర్ణ’ చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది… వ్యథలను భరించింది… అందరు ఉన్నా అనాథగా మరణించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

నిర్మలమ్మ గారు 1920 జూలై 18న మచీలీపట్నంలో జన్మించారు. 1943లో గరుడ గర్బభంగం అనే సినిమాలో తొలిసారిగా నటించారు. ఆ తరువాత పాదుకా పట్టాభిషేకం, కృష్ణ ప్రేమ, కులగోత్రాలో వంటి మొదటితరం హీరో అయినా ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించారు. ఆ తరువాత రాజేంద్రప్రసాద్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాల్లో నటించారు. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో వచ్చిన ప్రతీ సినిమా నిర్మలమ్మ కనిపించే ప్రయత్నం చేశారు. చివరగా ఆయన డైరెక్షన్లో వచ్చిన ‘ప్రేమకు స్వాగతం’లో నిర్మలమ్మ కనిపించి .. మళ్లీ వెండితెర వైపు చూడలేదు.

నిర్మలమ్మ పర్సనల్ లైఫ్ కొంచెం విషాదాంతమే. ఆమె ఎవరినీ పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేవు. అయితే కవిత అనే కుమార్తెను దత్తత తీసుకొని పెంచేవారు. ఆ తరువాత మరికొందరికి సాయం చేస్తూ వారి ఎదుగుదలకు సహకరించారు. సినిమాల నుంచి బయటకు వస్తున్న రోజుల్లో నిర్మలమ్మ డయాబెటిస్ తో బాధపడేవారు. కానీ ఈ విషయాన్ని తాను ఆలనా పాలనా చూసేవారు పట్టించుకోలేదు. నిర్మలమ్మ సాయంతో పెరిగి పెద్దయి జీవితంలో ఎదిగినా ఆమెను ఎవరూ బాగోగులు చూసుకోలేదు.

ఆత్మాభిమానంతో నిర్మలమ్మ తన ఆరోగ్య విషయాలను ఎవరికీ చెప్పలేదు. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు సైతం నిర్మలమ్మ గురించి పెద్దగా ఆలోచించలేదు. అంతేకాకుండా తన చివరి రోజుల్లో ఎంతో మదన పడుతూ ఉండేవారు. తనను ఎవరూ పట్టించుకోలేదనే బాధపడుతూ చివరికి 2009 ఫిబ్రవరి 19న కన్నమూశారు. నిర్మలమ్మ సాధారణంగానే మరణించారు అని అనుకున్నారు. కానీ ఆమెను ఆదరించేవారు లేక బాధపడుతూ మరణించినట్లు కొందరు ఆ తరువాత బయటపెట్టారు. ఎందరినో ఆదరించిన ఆమెను ఎవరూ పట్టించుకోకుండా మరణించడంపై ఆమె అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper