Heroine Sneha: తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి సౌందర్య తర్వాత అంతటి గొప్ప పేరు తెచ్చుకున్న నటిగా నిల్చిన హీరోయిన్ స్నేహా. అందాల ఆరబోతకు ఏమాత్రం తావు ఇవ్వకుండా,కేవలం నటనని నమ్ముకొని ఇండస్ట్రీ లో ఇన్నాళ్లు కొనసాగిన హీరోయిన్స్ లో ఒకరిగా స్నేహ నిలిచారు. ఇప్పటికీ ఆమె క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉంది.తెలుగు తెరకు పరిచయం కాకముందే ఈమె తమిళం లో పలు సినిమాల్లో నటించింది.
తెలుగు లో తరుణ్ హీరో గా నటించిన ‘ప్రియమైన నీకు’ అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో, స్నేహ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది సౌత్ లోనే అగ్ర తారగా నిల్చింది. ఇది ఇలా ఉండగా స్నేహ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
అసలు విషయానికి వస్తే స్నేహకి తమిళం లో అత్యధిక అవకాశాలు రావడానికి కారణం ప్రముఖ డైరెక్టర్ సుశి గణేశన్ అట. అప్పట్లో ఈయనే ఆమెకి తమిళం లో ఎన్నో అవకాశాలు ఇప్పించాడని,ఈమెతో డేటింగ్ కూడా చేసాడని వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో ఈయన ప్రశాంత్ మరియు స్నేహ ని పెట్టి ఒక సినిమాని తీసాడు.
ఈ మూవీ షూటింగ్ సమయం లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందని అప్పట్లో కోలీవుడ్ లో ఒక వార్త కోడై కూసింది.ఈ వార్త ని నిజం అని నమ్మిన సుశి గణేశన్ స్నేహ తో తరచూ గొడవలు పడేవాడట. ఒక రోజు బాగా తాగేసి వచ్చి స్నేహని రక్తం వచ్చేలా కొట్టాడట. అతను కొట్టిన దెబ్బలకు స్నేహ హాస్పిటల్ పాలైంది. ఎలా జరిగింది అని అడగగా యాక్సిడెంట్ అయ్యింది అంటూ కవర్ చేసింది కానీ అసలు విషయం చెప్పలేదు. ఈ సంఘటన తర్వాత వీళ్లిద్దరు విడిపోయారట, ఆ తర్వాత కొంతకాలానికి ప్రసన్న అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More