Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఆయన డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఫ్యాన్స్ లకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క సినిమాలో తన స్టెప్పులతో కుర్రాలను ఉర్రూతలూగించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఇక అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇంతకుముందు చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఒక్కసారిగా టాప్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా అల్లు అర్జున్ కి ఒక ముగ్గురు దర్శకులు చాలా వరకు హెల్ప్ చేశారు. వాళ్ల వల్లే ఆయన టాప్ హీరోగా మారడనే విషయం చాలా మందికి తెలీదు. ఇంతకీ వాళ్ళు ఎవరు అంటే ఒకరు సుకుమార్ కాగా, మరొకరు పూరి జగన్నాథ్ కావడం విశేషం…
ఇక వీళ్ళతో పాటుగా త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి లాంటి వారు కూడా అలీ అర్జున్ తో చాలా మంచి సినిమాలు చేసి తనను టాప్ హీరోగా మార్చారు. అతనికి భారీ సక్సెస్ లను కట్టబెట్టిన ఘనత కూడా వాళ్ళకే దక్కుతుంది… ఇక రీసెంట్ గా సుకుమార్ తో పుష్ప సినిమా చేశాడు. ఇక త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
కానీ పూరి జగన్నాధ్, సురేందర్ రెడ్డి లను మాత్రం అల్లు అర్జున్ అసలు పట్టించుకోవడం లేదు. వీళ్ళు ఒకప్పుడు టాప్ హీరోలుగా కొనసాగారు. వాళ్ళతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ చాలా రోజులపాటు వెయిట్ చేశాడు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. అతను టాప్ హీరోగా మారిపోయాడు కాబట్టి ఈ దర్శకులకు సినిమాలు ఇవ్వడానికి చాలా వరకు భయపడిపోతున్నాడు.
కారణం ఏంటంటే వాళ్ళు ఫామ్ లో లేరు. కాబట్టి సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తారా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అందువల్లే ఆయన వాళ్లతో సినిమా చేసి రిస్క్ చేయాలనుకోవడం లేదు. దానికోసమే ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది…
