spot_img
Homeఎంటర్టైన్మెంట్Actress Jeevitha Rajasekhar: జీవితా రాజశేఖర్ జస్ట్ మిస్... కానీ మేనేజర్ దొరికిపోయాడు!

Actress Jeevitha Rajasekhar: జీవితా రాజశేఖర్ జస్ట్ మిస్… కానీ మేనేజర్ దొరికిపోయాడు!

Actress Jeevitha Rajasekhar: డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. హ్యాపీగా ఒక ఏసీ గదిలో కూర్చొని సైబర్ నేరగాళ్లు కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. వాళ్ళ చేతిలో మోసపోయిన అమాయకులు తర్వాత లబో దిబో మన్నా ప్రయోజనం ఉండటం లేదు. తాజాగా నటి జీవిత రాజశేఖర్ టార్గెట్ గా సైబర్ నేరగాడు పెద్ద స్కెచ్ వేశాడు. ఆమె జస్ట్ మిస్ కావడంతో మేనేజర్ చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళితే కొద్దిరోజుల క్రితం జీవిత రాజశేఖర్ కి ఒక అజ్ఞాత వ్యక్తి నుండి కాల్ వచ్చింది. అతడు తనని తాను షారుక్ అని పరిచయం చేసుకున్నాడు. తాను జియో సంస్థలో పనిచేస్తాను, అని ఏదో చెప్పబోతుంటే నేను బిజీగా ఉన్నాను.. నా మేనేజర్ తో మాట్లాడమన్నారట.

Actress Jeevitha Rajasekhar
Actress Jeevitha Rajasekhar

షారుక్ అనే వ్యక్తి జీవిత రాజశేఖర్ మేనేజర్ తో మాట్లాడాడు. నాకు జియో సంస్థలో పదోన్నతి వచ్చింది. ఈ క్రమంలో జియో సంస్థ ద్వారా విక్రయించబడుతున్న వస్తువులు ఏవైనా మీకు 50 % డిస్కౌంట్ తో ఇస్తాను అన్నాడట. మేనేజర్ కి విశ్వాసం కలిగేందుకు కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ చేశాడట. సదరు స్క్రీన్ షాట్స్ లో రూ. 2.5 లక్షలు విలువ చేసే వస్తువులు రూ. 1.25 లక్షలకే ఇస్తున్నట్లు ఉందట. పూర్తిగా నమ్మిన మేనేజర్ షారుక్ కి రూ. 1.25 లక్షలు ఆన్లైన్లో చెల్లించాడట.

Also Read: Anasuya Bharadwaj: వైరల్ గా అనసూయ మేకప్ లెస్ లుక్… ఒరిజినల్ గా ఇలా ఉంటుందా?

డబ్బు చెల్లించి రోజులు గడుస్తున్నా వస్తువు రాకపోవడంతో పాటు షారుక్ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించాడట. అతనితో మాట్లాడిన ఫోన్ నెంబర్, బ్యాంకు డీటెయిల్స్ సమర్పించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు ఆచూకి తెలిసింది. చెన్నైకి చెందిన నాగేంద్రబాబు ఈ నేరానికి పాల్పడ్డారని గ్రహించిన పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.

Actress Jeevitha Rajasekhar
Actress Jeevitha Rajasekhar

కాగా నాగేంద్రబాబు పెద్ద కేటుగాడని పోలీసులు నిర్ధారించారు. గతంలో కూడా పలు నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తానని కూడా మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కొన్నాళ్ళు పాటు చెఫ్ గా పని చేశాడని తెలియజేశారు. పెద్ద తలకాయ జీవితానే నాగేంద్రబాబు టార్గెట్ చేశాడు. అనుకోకుండా ఆమె మేనేజర్ వలలో చిక్కుకున్నాడు. లక్ష రూపాయలు పైగా మోసపోయాడు. జనాల అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతుంది. జీవితా సైతం పలు ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొనడం కొస మెరుపు.

Also Read: Avatar 2 Ticket Price In India: అదిరిపోయిన అవతార్ 2 ట్రైలర్..రిలీజ్ డేట్ ఎప్పుడు..? టికెట్ రేటు ఎంతో తెలుసా..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper