Homeఎడ్యుకేషన్రైల్వేలో 3,591 ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో..?

రైల్వేలో 3,591 ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో..?

Railway Jobs

వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ భారీ సంఖ్యలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏకంగా 3,591 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. పదో తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. https://www.rrc-wr.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వైర్‌మెన్‌ ఇతర విభాగాల్లో ఖాళీలు ఉండగా పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. జూన్ 24వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కాకుండా మిగిలిన అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular