APSFC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 23 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మొత్తం 23 ఉద్యోగ ఖాళీలలో మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు 9 ఉండగా డిప్యూటీ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు 3, అసిస్టెంట్ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు 11 ఉన్నాయి. 2021 సంవత్సరం ఆగష్టు 1వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఏ, సీ.ఎం.ఏ, బీటెక్ అర్హతతో ఎంబీఏ, పీజీడీఎం, కమర్షియల్ లా, పీజీ డిగ్రీ లా ఇన్ బిజినెస్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీసీ, జనరల్ అభ్యర్థులకు 1,003 రూపాయలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 590 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 10వ తేదీలోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
https://esfc.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Apsfc recruitment 2021 invites applications for 23 vacancies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com