spot_img
Homeక్రైమ్‌Dating App Fraud: ఎవడ్రా నువ్వు.. డేటింగ్ తో న్యాయాధికారికే టోపీ.. ఎంత లాగాడో తెలుసా

Dating App Fraud: ఎవడ్రా నువ్వు.. డేటింగ్ తో న్యాయాధికారికే టోపీ.. ఎంత లాగాడో తెలుసా

Dating App Fraud: మన సమాజంలో న్యాయ విభాగంలో పనిచేసే వారికి ఎక్కువ ఆలోచన శక్తి ఉంటుంది అనుకుంటాం. వారి జ్ఞానం ముందు మిగతావారు తక్కువ అని భావిస్తుంటాం. కానీ ఇతడు ఏకంగా ఒక న్యాయాధికారికే చుక్కలు చూపించాడు. ఆమె వీక్నెస్ పాయింట్ దొరకబుచ్చుకొని చుక్కలు చూపించాడు. అదే కాదు ఏకంగా 52 లక్షలకు టోపీ పెట్టాడు. ఇక్కడితోనే కథ ముగిసిపోలేదు.

చండీగఢ్ ప్రాంతంలో ఒక మహిళ న్యాయాధికారిగా పని చేస్తోంది. ఈమెకు డేటింగ్ యాప్ టెండర్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అపరిచయం కాస్త చాలా దూరం వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య గట్టిగానే వ్యవహారం సాగింది. ఆమెకు అతడు స్వర్గసుఖాలు చూపించాడు. దీంతో అతడికి ఆమె సరెండర్ అయిపోయింది. ఏకంగా 52 లక్షలు ఆమె నుంచి అతడు వసూలు చేశాడు.. అతడి చేతిలో మోసపోయానని తెలుసుకున్న తర్వాత ఆ న్యాయాధికారి తన అధికారాన్ని ఉపయోగించి కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు విచారణలో అసలైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ న్యాయ అధికారి తన పేరు మీద కేసు ఫైల్ చేస్తే పరువు పోతుందని భావించి.. తన ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరు మీద కేసు నమోదు చేసింది. దీంతో కేసు విచారించిన న్యాయమూర్తి మోసం చేసిన ఆ వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు. ఇటీవల ఆ నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ సెషన్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సమయంలో అసలైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా మోసపోయింది పనిమనిషి కాదని.. న్యాయాధికారి అని బయటికి తేలింది. “భారీగా లాభాలు వచ్చే పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేసాడని” ఆ పనిమనిషి పిటిషన్ లో పేర్కొంది..”ముందుగా నా ఖాతా నుంచి ఐదు లక్షలు.. మా యజమాని ఖాతా నుంచి మిగతా మొత్తం నగదు అతని ఖాతాకు బదిలీ చేసాం” అని ఆ పనిమనిషి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై న్యాయమూర్తి విచారణ సాగించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంలో నిందితుడు దీపక్ వాట్స్.. 2025లో ఆ మహిళ న్యాయధికారికి డేటింగ్ యాప్ టిండర్ ద్వారా పరిచయం అయ్యాడు. తన పేరును అభిమన్యు వశిష్ట అని మార్చుకున్నాడు.. తాను ఇండియన్ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. దీంతో అతని మాటలను నమ్మిన ఆ న్యాయ అధికారి అతడికి పూర్తిగా లొంగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతడు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. రకరకాల మార్గాలలో పెట్టుబడులు పెడితే డబ్బులు వస్తాయని చెప్పాడు. అప్పటికే అతడికి లొంగిపోయిన ఆమె.. డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. దాదాపు 52 లక్షలు వివిధ మార్గాల ద్వారా అతనికి బదిలీ చేసింది.

లాభాలు చూపించకపోగా.. పదేపదే డబ్బులు అడగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆ న్యాయ అధికారి తన ఇంట్లో పని చేసే దీక్ష దేవి పేరు మీద కేసు నమోదు చేసింది.. మరోవైపు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా దీపక్ సరికొత్త విషయాలను బయటపెట్టాడు..”నన్ను ఆమె ఇష్టపడింది. నాతో కలిసి చాలా రోజులు ఉంది. ఆమెకు డబ్బు పిచ్చి ఎక్కువగా ఉంటుంది.. నాకు బెట్టింగ్లలో డబ్బు పెట్టమని ఆమె స్వచ్ఛందంగా ఇచ్చింది. అక్కడ నేను నష్టపోయానని” దీపక్ చెప్పాడు. దీంతో కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. అయితే ఈ కేసులో ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉండడంతో న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper