Homeకరోనా వైరస్కరోనా బాధితులకు శుభవార్త.. ఈ ఔషధంతో వైరస్ కు చెక్..?

కరోనా బాధితులకు శుభవార్త.. ఈ ఔషధంతో వైరస్ కు చెక్..?

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2 – డీజీ అనే ఔషధం కరోనా సోకిన వాళ్లు వేగంగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని తేలింది. త్వరలో ఈ ఔషధం మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది.

ఈ ఔషధాన్ని వినియోగించడం వల్ల కరోనా బాధితులకు ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరం కూడా తగ్గనుందని తెలుస్తోంది. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) ఇప్పటికే ఈ ఔషధానికి అనుమతులు లభించాయి. అత్యవసర వినియోగానికి ఈ ఔషధం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్‌ ఈ ఔషధాన్ని తయారు చేయడం గమనార్హం.

ఎవరైతే ఈ ఔషధాన్ని వాడారో వారిలో కేవలం నాలుగు నుంచి ఐదు నెలల్లోనే కరోనా నెగిటివ్ వచ్చిందని తెలుస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్న తరుణంలో 2 – డీజీ అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. కరోనా వైరస్‌ పెరుగుదలను సమర్థవంతంగా ఈ ఔషధం అడ్డుకుంటుంది. సాధారణంగా కోలుకునే రోగులతో పోలిస్తే ఈ ఔషధం తీసుకున్న రోగులు మూడురోజుల ముందుగానే కోలుకున్నట్టు తెలుస్తోంది.

పొడి రూపంలో లభించే ఈ ఔషధాన్ని నీటిలో కరిగించుకుని తాగాల్సి ఉంటుంది. కణాల నుంచి వైరస్‌లు శక్తి పొందకుండా నిరోధించడంలో ఈ ఔషధం తోడ్పడుతుంది. ఈ ఔషధం సాధారణ గ్లూకోజ్ అణువులను పోలి ఉండటం గమనార్హం. అతి త్వరలోనే ఈ ఔషధం మార్కెట్ లోకి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular