Homeబిజినెస్Simple Energy Electric Scooter: అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు 'సింపుల్ ఎనర్జీ' కొత్త ప్లాన్..

Simple Energy Electric Scooter: అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ‘సింపుల్ ఎనర్జీ’ కొత్త ప్లాన్..

Simple Energy Electric Scooter: ప్రస్తుతం చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లకు మారుతున్నారు. రోజువారి వినియోగదారులతో పాటు కొంతమంది యూత్ సైతం వీటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అయితే మొదట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ పై కాస్త ఆందోళన వాతావరణం ఉండేది. కానీ ఆ తర్వాత వీటిపై ఎక్కువగా అవగాహన ఏర్పడుతుండడంతోపాటు తక్కువ ధరలోనే అందుబాటులో ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు వారికి అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా సింపుల్ ఎనర్జీ అనే కంపెనీ ఓ కొత్త స్కూటర్ ను పరిచయం చేయబోతుంది. ఇది మైలేజ్ విషయంలో రైడర్లకు ఫుల్ సపోర్ట్ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఈ స్కూటర్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం..

బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ అనే కంపెనీ ఇప్పటివరకు వన్, వన్ ప్లస్ అనే స్కూటర్లను రోడ్లపై తిప్పుతోంది. అయితే వినియోగదారులు అప్డేట్ కావడంతో వారికి అనుగుణంగా సరికొత్త స్కూటర్ ను పరిచయం చేయాలని అనుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ కొత్త మోడల్ ను పరీక్షిస్తుంది. సింపుల్ ఎనర్జీ కొత్త స్కూటర్ కు అరైవ్ అని పేరు పెట్టినట్లు ఇంటర్నెట్ ద్వారా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆన్లైన్లో ఉండడంతో చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు.

ఈ స్కూటర్ రోజువారి వినియోగదారులతోపాటు యూత్ కూడా ఎక్కువగా వినియోగించడానికి అనుగుణంగా ఉంది. ముఖ్యంగా దీని మైలేజ్ విషయంలో ప్రత్యేకంగా చర్చ సాగుతుంది. ఒకసారి దీనిని చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఉన్నవారు సైతం దీనిని కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే దీన్ని సీటింగ్ వెడల్పుగా ఉండి సౌకర్యవంతంగా ఉండనుంది. లాంగ్ డ్రైవ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ లో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. డిజిటల్ డిస్ప్లే తో పాటు.. రైడర్లకు సేఫ్టీ గా ఉండేందుకు బ్రేకింగ్ సిస్టం ను కూడా అమర్చినట్లు తెలుస్తోంది. అలాగే మొబైల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కూడా ఉండనున్నాయి.

ఇది మార్కెట్లోకి వస్తే రూ. ఒక లక్షతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటివరకు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చినా కూడా వాటిని లక్షకు పైగానే విక్రయిస్తున్నారు. మరికొన్ని స్కూటర్లు లక్షలోపు ఉన్నా కూడా అవి కొంతమంది వినియోగదారులను ఆకట్టుకోలేక పోతున్నాయి. అయితే సింపుల్ ఎనర్జీకి సంబంధించిన ఈ కొత్త స్కూటర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper