spot_img
Homeబిజినెస్Government funds credited: రూ.7,887 కోట్లు అకౌంట్లలో జమ.. చెక్ చేసుకున్నారా?

Government funds credited: రూ.7,887 కోట్లు అకౌంట్లలో జమ.. చెక్ చేసుకున్నారా?

Government funds credited: మరి ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. గత పంటకు సంబంధించిన ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా ధాన్యం సేకరిస్తున్నామని ఆయన అన్నారు. రైతులపై ప్రేమ ఉన్నందువలనే నిబద్ధతతో ధాన్యం సేకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నామని అంటున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రాఫ్ లో 41.6 ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ ధాన్యం సేకరణకు సంబంధించిన డబ్బులు రూ.7,887 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించామని అన్నారు. ఈ డబ్బులు ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో వేశామని అన్నారు.

పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో అత్యధికంగా ధాన్యం సేకరణ జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 11.2 లక్షల టన్నుల ధాన్యం సేకరించారని.. తెలంగాణలో మాత్రం అందుకు నాలుగు రేట్లు అధికంగా 41. 6 టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణలో 7.5 లక్షల మంది రైతులకు నేరుగా ధాన్యం చెల్లిస్తే.. ఆంధ్రప్రదేశ్లో 1.7 లక్షల మంది రైతులకు రూ.2,830 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో సన్నారకం ధాన్యానికి అదనంగా బోనస్ ను రూ.314 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ ప్రకటించిన తర్వాత చాలామంది రైతులు ఈ రకమైన పంటను వేశారని.. రైతులను ప్రోత్సహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

గతంలో కంటే ఇప్పుడు సన్నరకం పంట విస్తీర్ణం పెరిగిందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణలో అత్యధిక ప్రగతి సాధించిందని అంటున్నారు. ఓవైపు ధాన్యం వేగంగా సేకరించడంతోపాటు మరోవైపు వారికి డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం శ్రద్ధ వహించడంతోనే ఇది సాధ్యమైందని అంటున్నారు.

ధాన్యం సేకరణలో మాత్రమే కాకుండా రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా చెల్లిస్తున్నారు. ఈ విషయంలోనూ కూడా ఎక్కడ తగ్గేది లేదని ఇప్పటికే మంత్రులు తెలిపారు. అయితే కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతూ రైతులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని.. కొన్ని ఏరియాలో ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారని.. వారికి సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. ధాన్యం సేకరణ సమయంలోనే భారీ వర్షాలు కురవడంతో చాలావరకు పంట నష్టపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
Oktelugu Epaper